Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న కారులో ఆరేళ్లకూతురు, తల్లిపై గ్యాంగ్ రేప్...!!

ఉత్తరాఖండ్ లోని రూర్కీలో దారుణం జరిగింది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. ఓ మహిళ, ఆమె ఆరేళ్ల కూతురిపై కదులుతున్న కారులో అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. 

Woman 6-Year-Old Daughter Gangraped In Moving Car in  Uttarakhand
Author
Hyderabad, First Published Jun 27, 2022, 8:29 AM IST

ఉత్తరాఖండ్ :  Uttarakhand, హరిద్వార్‌లోని రూర్కీలో ఒక మహిళ ఆమె ఆరేళ్ల కుమార్తెపై కదులుతున్న కారులో Gangrape జరిగింది. వారిద్దరికీ ఓ వ్యక్తి కారులో lift ఇచ్చాడు. ఆ తరువాత అతను, అతని స్నేహితులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఆ మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి రాత్రి సమయంలో ముస్లిం మత ప్రాంతమైన పిరాన్ కలియార్ నుండి ఇంటికి వెళుతుండగా, సోను అనే వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడని వారు చెప్పారు. 

ఆమె కారులోకి ఎక్కే సమయానికే ఆ వ్యక్తి స్నేహితులు కొందరు కారులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) ప్రమేంద్ర దోవల్ తెలిపారు. ఫిర్యాదు ప్రకారం, సోను, అతని సహచరులు ఆమెను కారులోకి ఎక్కించుకున్న తరువాత కదులుతున్న కారులోనే మహిళ, ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి అనంతరం కాలువ దగ్గర పడేశారు. దీంతో షాక్ లోకి వెళ్లిన మహిళ.. తేరుకుని అర్థరాత్రి ఎలాగో దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కారులో ఎంత మంది పురుషులు ఉన్నారో మహిళ సరిగ్గా చెప్పలేనప్పటికీ, దానిని నడుపుతున్న వ్యక్తి పేరు సోను అని ఆమె చెప్పింది. బాధితులిద్దరినీ రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో చేర్పించామని, వారి వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. దీనిమీద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని, అయితే ఇంకా వారి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.

బాలికపై పెదనాన్న కుమారిడి అత్యాచారం, అది తెలిసి స్నేహితుడు కూడా..

కాగా, జూన్ 24న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. తన భర్తను తాగుడుకు బానిస అయ్యేలా చేయడంతోపాటు.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే తామిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఓ లేఖ కూడా రాశారు.

పోలీసుల కథనం ప్రకారం… ‘నా చావుకు, నా భర్త చావు కారణం షేక్ ఇలియాజ్.. నా భర్తను తాగుడికి బానిస అయ్యేలా చేశాడు. ఆయన ద్వారా నాకు మత్తు మందు ఇచ్చి సృహ తప్పి పడిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మేము ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తర్వాత అయినా అతనికి శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం’ అని బాధితురాలు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది. 

ఆ తర్వాత దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. నిందుతుడు వారిని ఎలా బ్లాక్ మెయిల్ చేసిందీ వెల్లడించారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios