Asianet News TeluguAsianet News Telugu

గాడ్సేపై వస్తున్న సినిమాను కూడా ప్రధాని నిషేధిస్తారా? - అసదుద్దీన్ ఒవైసీ

మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేపై వస్తున్న సినిమాను కూడా ప్రధాని మోడీ అడ్డుకుంటారా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బ్రిటీష్ చట్టాల ఆధారంగా ప్రభుత్వం భారత్ లో ట్విట్టర్, యూట్యూబ్ లో బీబీసీ ఇంటర్వ్యూను నిషేధించిందని అన్నారు. 

Will the Prime Minister also ban the film on Godse? - Asaduddin Owaisi
Author
First Published Jan 23, 2023, 11:44 AM IST

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేపై రాబోయే సినిమాను కూడా ప్రధాని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ‘‘బ్రిటీష్ చట్టాల ఆధారంగా మోడీ ప్రభుత్వం భారత్ లో ట్విట్టర్, యూట్యూబ్ లో బీబీసీ ఇంటర్వ్యూను నిషేధించింది. గుజరాత్ అల్లర్లలో అంతరిక్షం నుంచి, ఆకాశం నుంచి ఎవరైనా ప్రజలను చంపారా అని మోడీని అడుగుతున్నాం.’’ అని ఆయన పేర్కొన్నారు.

వరకట్నహత్య?.. ఉరికి వేలాడుతూ వివాహిత.. ఆత్మహత్య అంటున్న అత్తింటివారు..

గాడ్సేపై అధికార పార్టీ నాయకుల అభిప్రాయం ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. ‘‘ ఈ కార్యక్రమాన్ని బీజేపీ నిషేధించింది. గాంధీని హత్య చేసిన గాడ్సే గురించి మీ అభిప్రాయం ఏమిటని నేను ప్రధానిని, బీజేపీ నాయకులను అడుగుతున్నాను. ఇప్పుడు గాడ్సేపై ఓ సినిమా వచ్చింది. గాడ్సేపై తీస్తున్న సినిమాను ప్రధాని బ్యాన్ చేస్తారా? గాడ్సేపై సినిమాను నిషేధించాలని బీజేపీకి సవాల్ విసురుతున్నాను’’ అని ఆయన అన్నారు.

అరక్కోణంలో ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. క్రేన్ కూలి నలుగురు మృతి, 9 మందికి గాయాలు..

‘‘ ఢిల్లీలో ‘జీ20 ఇన్‌ మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అనే క్యాప్షన్‌తో జీ20 పోస్టర్లు ఉన్నాయి. య్యూటూబ్ లో నిషేధం (బీబీసీ డాక్యుమెంటరీపై) ఉంది. గాడ్సే, సావర్కర్ మధ్య విభిన్నమైన ప్రేమ ఉండేది. గాంధీ హత్యకు గురైన జనవరి 30లోపు గాడ్సేపై సినిమాను నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నాం.’’ అని ఆయన అన్నారు.

ప్రియుడికోసం.. కట్టుకున్న భర్తను 26సార్లు తలమీద కొట్టి హత్య చేసి, పెట్రోల్ పోసి హతమార్చిన భార్య..

ప్రధాని మోడీపై రెండు భాగాల బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం బ్లాక్ చేసిన తర్వాత ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి. అయితే ఇది ప్రచారమని పేర్కొంటూ పలు యూట్యూబ్ వీడియోలు, ట్విటర్ పోస్టులను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సెన్సార్‌షిప్‌ నేపథ్యంలో ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. ‘‘ భారత్ లో ఎవరూ బీబీసీ షో చూడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన చక్రవర్తి, ఆస్థానాధికారులు ఇంత అభద్రతాభావంతో ఉండటం సిగ్గుచేటు’’ అని పేర్కొన్నారు. 

ఫ్రమ్ ది ఇండియా గేట్: ఓటు విలువ, అనువాదంతో తలనొప్పి, రాయల్టీ వర్సెస్ లాయల్టీ..

కాగా.. ‘‘ భారత్ లో కొందరు ఇప్పటికీ వలసవాద మత్తు నుంచి తేరుకోలేదు. వారు బీబీసీని భారత సుప్రీం కోర్టు కంటే ఎక్కువగా భావిస్తారు. వారి నైతిక యజమానులను ప్రసన్నం చేసుకోవడానికి దేశ గౌరవాన్ని, ప్రతిష్ఠను ఎంతవరకైనా తగ్గిస్తారు. ఏదేమైనా భారత్ బలాన్ని బలహీనపరచడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న ఈ తుక్డే తుక్డే గ్యాంగ్ సభ్యుల నుంచి ఇంతక కంటే ఎక్కువగా ఏం ఆశించగలం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వివాదాల నేపథ్యంలో యూకే చట్టసభ సభ్యుడు, లార్డ్ కరణ్ బిలిమోరియా మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని గ్రహం మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరు అని కొనియాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios