Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడికోసం.. కట్టుకున్న భర్తను 26సార్లు తలమీద కొట్టి హత్య చేసి, పెట్రోల్ పోసి హతమార్చిన భార్య..

ఇష్టంలేని పెళ్లి చేశారని భర్తను 26సార్లు తలమీద దారుణంగా కొట్టి హతమార్చింది భార్య. ఆ తరువాత అతడిని బైక్ మీద కూర్చోబెట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించింది. 

wife brutally assassinated husband in gujarat - bsb
Author
First Published Jan 23, 2023, 10:39 AM IST

గుజరాత్ : గుజరాత్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భార్య.. భర్తను అత్యంత దారుణంగా ఇనపరాటితో 26 సార్లు కొట్టి హత్య చేసింది. ఆ తరువాత భర్త మరణం మీద రకరకాల కథలను పోలీసులకు చెప్పింది. కానీ, చివరికి నిజం ఒప్పుకుని  కటకటాలపాలైంది. గుజరాత్ లోని నదియాడ్ లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..  సదరు భార్య చదువుకునే రోజుల్లోనే ఓ యువకుడితో ప్రేమలో పడింది. అయితే వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో బలవంతంగా మరో వ్యక్తితో వివాహం జరిపించారు. 

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడంతో.. పెళ్లయిన భర్త ఇష్టం లేకపోవడంతో అతనితో సఖ్యంగా ఉండలేకపోయింది. తన ప్రేమను వదులుకోలేక పెళ్లి తర్వాత కూడా అతనితో అనుబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే భర్తను చంపేస్తే ప్రియుడుతో జీవితాంతం కలిసి ఉండొచ్చని పథకం వేసింది. ఆ ప్లాన్ ప్రకారమే భర్తను చంపేసింది. చివరికి పోలీసులకు దొరికి జైలు పాలయ్యింది. నడియాడ్ జిల్లా కపద్వాంజ్ కు చెందిన ఖమ్మం అనే యువతికి రెండేళ్ల క్రితం ఖేంగార్ భాయ్ అనే వ్యక్తితో పెద్దలు వివాహం జరిపించారు. అయితే అప్పటికే కముబెన్ మరో యువకుడిని ప్రేమించింది.  

ఇన్ స్ట్రాగ్రాంలో పరిచయమైన స్నేహితుడు.. కలుద్దామని పిలిచి యువతిపై ఆరునెలలుగా అత్యాచారం..

ఈ విషయం తెలిసిన పెద్దలు దీనికి అంగీకరించలేదు. బలవంతంగా ఖేంగార్ భాయ్ తో పెళ్లి చేశారు. ఇష్టంలేని పెళ్లి కావడంతో భర్తతో సరిగా కాపురం చేయలేకపోయింది. ప్రియుడితో పెళ్లికి ముందటి సంబంధాన్ని కొనసాగించింది. అయితే ఈ విషయం ఎప్పటికైనా భర్తకు తెలుస్తుందని భయపడింది. దీనికంటే ముందే అతని అడ్డు తొలగించుకుంటే సమస్య ఉండదని భావించింది. నిరుడు ఈ పథకాన్ని అమలు చేసింది. పొలానికి వెళ్లిన భర్తను అక్కడే హతమార్చింది.  పొలంలో మంచంపై నిద్రపోతున్న భర్త తల మీద ఇనపరాడ్డుతో 26సార్లు దారుణంగా కొట్టింది.  

దీంతో భర్త అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తరువాత ఆ హత్యను వేరే దారి మళ్లించడానికి మరో ప్లాన్ వేసింది. మృతదేహాన్ని భర్త బైకు మీద కూర్చోబెట్టి.. పెట్రోల్ ని పోసి నిప్పంటించింది. ఆ తర్వాత ఊర్లోకి వెళ్లి పొలంలో తన భర్త మీద దుండగులు దాడి చేశారని.. అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టారని ఏడుస్తూ చెప్పింది. పోలీసులకు కూడా ఇదే విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే విచారణలో వారికి అనుమానాలు తలెత్తాయి. 

వారికి దోపిడీకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో  అసలు ఫిర్యాదులోనే తిరకాసు ఉన్నట్లుగా అనుమానించారు.  కుముబెన్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె నిజం అంగీకరించింది. ప్రియుడు కోసం భర్తను అతి దారుణంగా చంపిన ఆమెకు కోర్టు జీవిత ఖైదు విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios