Asianet News TeluguAsianet News Telugu

వరకట్నహత్య?.. ఉరికి వేలాడుతూ వివాహిత.. ఆత్మహత్య అంటున్న అత్తింటివారు..

వరకట్నం కోసమే ఆమెను హత్య చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించగా, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అత్తమామలు చెబుతున్నారు.

Woman committed suicide in uttar pradesh,family alleges dowry killing by in laws - bsb
Author
First Published Jan 23, 2023, 11:28 AM IST

ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని కమ్‌హెడ గ్రామంలో 24 ఏళ్ల మహిళ తన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. అయితే, వరకట్నం కోసమే ఆమెను హత్య చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తమామలు చెబుతున్నారు. రూప ఆదివారం రాత్రి తన ఇంట్లో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించిందని సర్కిల్ ఆఫీసర్ రమాశిష్ యాదవ్ తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు ఆయన తెలిపారు.

రూప తండ్రి ఓంపాల్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తెను అత్తమామలే హత్య చేశారని ఆరోపించారు. ఆమె భర్త దీపక్, ఆమె మామ భూపాల్, ఆమె అత్తగారు సత్తో, ఆమె మరిది కాకులను ఆమె హత్య కేసులో నిందితులుగా పేర్కొన్నాడు. రూ. 2 లక్షలు కట్నం ఇవ్వాలని తన కుమార్తె అత్తమామలు ఒత్తిడి చేస్తున్నారని, తన కుమార్తెను వేధిస్తున్నారని సింగ్ ఆరోపించారు. రూప 2020లో దీపక్‌ని పెళ్లాడింది.

ప్రియుడికోసం.. కట్టుకున్న భర్తను 26సార్లు తలమీద కొట్టి హత్య చేసి, పెట్రోల్ పోసి హతమార్చిన భార్య..

అయితే, అత్తమామలు ఈ వాదనను కొట్టివేశారు. రూప తన గదిలో పైకప్పుకు ఉరి వేసకుని వేలాడుతున్నట్లు కనిపించిందని.. కనిపెట్టినట్టు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఓ తెలిపారు.

ఇదిలా ఉండగా, వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు నేపథ్యంలో హత్యలు జరుగుతున్న ఘటనలు ఇటీవల కాలంలో  ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి 24 ఏళ్ల యువకుడిని హత్య చేశాడు. ఆ యువకుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమో అనే అనుమానమే దీనికి కారణం. చంపేసిన తర్వాత అంతటితో ఆగకుండా.. అతని మృతదేహాన్ని దారుణంగా పది ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికిన ఆ శరీర భాగాలను మూడు సంచుల్లో మూటగట్టి  పొదల్లో విసిరేశాడు. 

ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఉంటున్న ఓ రిక్షా కార్మికుడు ఈ అత్యంత దారుణమైన హత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని అక్షయ్ (24)గా గుర్తించారు పోలీసులు. అతను రాజస్థాన్ లోని కోట్ పుట్లి పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హత్య వెలుగులోకి రావడంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  రిక్షా కార్మికుడైన మిహ్లాల్ (34)  భార్య పూనమ్. ఆమె అతనికి రెండో భార్య. గత కొద్ది రోజులుగా మిహ్లాల్.. పూనమ్ మీద అనుమానం పెంచుకున్నాడు. అక్షయ్ అనే యువకుడితో తన రెండో భార్య  వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా  సదరు వ్యక్తిని చంపాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం.. అక్షయ్ ని హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి… దగ్గరలోని కాలువ పక్కన మూడు సంచుల్లో మూటగట్టి పడేశాడు.

శనివారం కాలువ పక్కన సంచుల్లో ఉన్నమృతుడి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో రిక్షా కార్మికుడైన  మిహ్లాల్ మీదికి అనుమానం వెళ్ళింది. తడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరమాంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. హత్యానేరం కింద జైలుకు పంపించినట్లు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios