పాము కాటుకు గురైన భార్య, ఆ పామును హాస్పిటల్ కు తీసుకెళ్లిన భర్త.. అతడి సమాధానం విని ఖంగుతిన్న డాక్టర్లు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో ఓ వింత చోటు చేసుకుంది. తన భార్యను ఓ పాము కాటేయడంతో భర్త ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అయితే ఆమె వెంట ఆ పామును కూడా తీసుకెళ్లాడు.
సాధారణంగా ఎవరినైనా పాము కరిస్తే ఏం చేస్తారు.. ? ఆ పాముపై దాడి చేసి చంపేస్తారు. కురదకపోతే దానిని అలానే వదిలేసి ముందుగా పాము కాటుకు గురైన వారిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడ చికిత్స అందిస్తారు. అవసరం అనుకుంటే మెరుగైన చికిత్స కోసం మరో పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్తారు. ఏ పాము కాటేసిందో, దాని వివరాలు చెబితే డాక్టర్లు దానికి అనుగుణంగా ట్రీట్ మెంట్ అందిస్తారు. కానీ ఉత్తప్రదేశ్ లో ఓ వ్యక్తి గమ్మతైన పని చేశాడు. తన భార్యను పాము కాటు వేయడంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఆమెతో పాటు ఆ పామును కూడా అక్కడి తీసుకెళ్లడంతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులు అయ్యారు.
AIADMK: ఏఐఏడీఎంకేలో ఆధిపత్య పోరు.. చెన్నైలో యాత్ర చేపడుతున్న శశికళ
ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మఖీ పోలీస్ సర్కిల్ పరిధిలోని అఫ్జల్ నగర్ ప్రాంతంలో రామేంద్ర యాదవ్ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆ ఇంట్లోకి ఓ పాము చొరబడింది. అది తిన్నగా వెళ్లి అతడి భార్యను కాటేసింది. దీంతో ఆయన ఆందోళన చెందాడు. వెంటనే భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్లాలని భావించాడు. కానీ దాని కంటే ముందు అతడు ఓ విచిత్ర పని చేశాడు. ఆ పామును తిప్పలు పట్టుకున్నాడు. అనంతరం దానిని ఓ ప్లాస్టిక్ బాటిల్ లో వేశాడు. అది చనిపోకుండా ఉండేందుకు, ఊపిరి ఆడేందుకు ఆ ప్లాస్టిక్ బాటిల్ కు సన్నని రంద్రాలు చేశాడు.
16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు శివసేన పిటిషన్.. వాట్ నెక్స్ట్?
తరువాత తన భార్యను, ఆమె వెంట పామును హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. రామేంద్ర యాదవ్ చేతిలో పామును చూసిన అక్కడున్న సిబ్బంది, రోగులు అలాగే నిలబడిపోయారు. తన భార్యను డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి జరిగిన ఘటనను వివరించారు. అతడి చేతిలో పామును చూసి డాక్టర్లు కూడా భయపడ్డారు. ఆ పామును ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని ప్రశ్నించారు. ఆయన చెప్పిన సమాధానం విని డాక్టర్లు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. ‘‘ ఇక్కడికి వచ్చిన తరువాత నా భార్యను ఏ పాము కరిచిందని మీరు అడిగితే అప్పుడు నేనేం చేయాలి. నాకు ఆ పాము ఏంటో తెలియదు. అందుకే మీరే చూస్తారని డెరెక్ట్ గా ఇలా పట్టుకొచ్చాను.’’ అని అన్నాడు. దీంతో ఆ డాక్టర్లు ఆయనను పక్కకు పంపించి ఆమెకు ట్రీట్ మెంట్ మొదలు పెట్టారు.
బాప్ రే..శునకం బర్త్ డే పార్టీకి 100 కిలోల కేక్, 5 వేల మందికి విందు భోజనం..
ఈ విషయం మెళ్లగా ఆ ప్రాంతంలోని చాలా మందికి తెలిసిపోయింది. వెంటనే మీడియా కూడా అక్కడికి చేరుకుంది. దీంతో ఈ విషయం ఒక్క సారిగా వైరల్ గా మారిపోయింది. పామును ఏం చేస్తావని మీడియా రామేంద్ర యాదవ్ ను ప్రశ్నించగా.. తన భార్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెడతానని చెప్పారు. పాము ఊపిరి తీసుకునేందుకు వీలుగా ప్లాస్టిక్ బాటిల్కు రంధ్రాలు వేశానని తెలిపారు.