
Tamil Nadu Political Drama: తమిళనాడులో హైడ్రామా.. గవర్నర్ను మళ్లీ కలిసిన విజయ్
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ కొనసాగుతున్న అనిశ్చితి మధ్య టీవీకే అధినేత విజయ్ మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు సమయం కల్పించాలని విజయ్ కోరినట్లు సమాచారం. అయితే గవర్నర్ నుంచి స్పష్టమైన హామీ లభించలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.