ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యా మౌనం పాటించగా, ఉగ్రవాదంపై మోదీ-పుతిన్ ఫోన్లో చర్చించారు.
ఇటీవల భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" నేపథ్యంలో రష్యా తీసుకున్న స్థానం నేషనల్ సెక్యూరిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాద శిబిరాలపై భారత్ కౌంటర్ చర్యలు తీసుకున్నప్పటికీ, రష్యా మాత్రం దీనిపై ఓపెన్గా మద్దతు తెలపలేదు గానీ వ్యతిరేకత కూడా చూపలేదు.
ఆపరేషన్ సమయంలో రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ అయిన S-400, బ్రహ్మోస్ క్షిపణుల వంటివి వార్తల్లో ప్రాధాన్యం పొందాయి. కానీ రష్యా అధికార ప్రతినిధులు మాత్రం పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదంపై ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మౌనంగా ఉన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని, పరిష్కారానికి చర్చలే మార్గమని సూచించింది.
ఇదిలా ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్లో మాట్లాడారు. ఈ కాల్ సందర్భంగా ఇటీవల జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిపై పుతిన్ సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై కలసి ఎదుర్కోవడం అవసరమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని TV BRICS వార్తా సంస్థ నివేదించింది.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఉద్దేశంతో మోదీ, పుతిన్ మధ్య మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పుతిన్ను భారత్లో జరిగే వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి మోదీ ఆహ్వానించారు. రష్యా ఈ ఆహ్వానాన్ని అంగీకరించింది.ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా గ్లోబల్ విధానాల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి. గతంలో భారత పక్షాన గట్టిగా నిలిచిన రష్యా, ఇప్పుడు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ, నెయుట్రల్ వైఖరి తీసుకుంటోంది. దీని ప్రభావం భారత-రష్యా భవిష్యత్ వ్యూహాత్మక సంబంధాలపై ఎలా పడుతుందో చూడాల్సి ఉంది.


