భారత్ను ఆర్థికంగా మూడో స్థానం తీసుకురావాలంటే స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
భారతదేశ అభివృద్ధి కేవలం ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ఆర్థికంగా మూడో స్థానానికి తీసుకురావాలంటే మనం విదేశీ వస్తువులపై ఆధారపడటం తగ్గించుకోవాలని స్పష్టం చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పటికే స్థిరపడిందని, ఇక మూడో స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని ప్రధాని అన్నారు. దేశీయ పరిశ్రమలు బలపడాలంటే ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విదేశాల నుంచి చిన్న చిన్న గణేష్ విగ్రహాలు రావడం, అవి కూడా నాణ్యతలేని రూపంలో ఉండటం బాధాకరమన్నారు.
Scroll to load tweet…


