Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ యాంటీ నేషనలిస్ట్ టూల్ కిట్ లో భాగమయ్యారు - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

రాహుల్ గాంధీ యాంటీ నేషనలిస్ట్ టూల్ కిట్ లో భాగం అయ్యారని బీజేపీ జాతీయాధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. జీ20 సమావేశాలు భారత్ లో జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాల్లో మన దేశాన్ని, పార్లమెంటును అవమానిస్తున్నారని అన్నారు. 

Part of Rahul Gandhi's anti-nationalist tool kit - BJP chief JP Nadda
Author
First Published Mar 17, 2023, 12:50 PM IST

యూకేలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జాతి వ్యతిరేక టూల్ కిట్ లో రాహుల్ గాంధీ శాశ్వత భాగమైపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. ‘‘దేశం పదేపదే తిరస్కరించిన తరువాత, రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ జాతి వ్యతిరేక టూల్ కిట్ లో శాశ్వత భాగం అయ్యారు’’ అని నడ్డా వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు.

మహారాష్ట్ర హెచ్ఎస్సీ ఎగ్జామ్స్ పేపర్ లీక్ కేసు.. మ్యాథ్స్ తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు కూడా...

భారత అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేయడంపై రాహుల్ గాంధీ ఉద్దేశమేమిటని నడ్డా ప్రశ్నించారు. ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని, జీ20 సమావేశాలు ఇక్కడ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశాన్ని, పార్లమెంటును అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా.. గురువారం కూడా అధికార బీజేపీ, ప్రతిపక్షాలు తమ వైఖరికి కట్టుబడి ఉండటంతో పార్లమెంటులో ఏర్పడిన గందరగోళం వరుసగా నాలుగో రోజు కొనసాగింది. అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టగా, యూకేలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.

సిక్కుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఎంతో చేశారు - ఖలిస్థాన్ అనుకూల మాజీ నేత జస్వంత్ సింగ్ థేకేదార్

ఉభయ సభల్లో నిరసనలు కొనసాగుతుండటంతో తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత సభను వాయిదా వేశారు. మార్చి 13వ తేదీన రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో తనపై ఆరోపణలు చేసిన మంత్రులకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ చెప్పడంతో ఈ వివాదం పార్లమెంటు వెలుపల కూడా నడిచింది. 

ఇటీవల లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో జరిగిన ఓ ఉపన్యాసంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. భారత ప్రజాస్వామ్యం ఒత్తిడికి, దాడికి గురవుతోందని అందరికీ తెలుసునని, వార్తల్లో నిలిచిందని అన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష సభ్యుడు ముఖ్యమైన అంశాలను లేవనెత్తినప్పుడు మైక్ లు తరచుగా ఆఫ్ అవుతాయని లండన్ లోని బ్రిటిష్ పార్లమెంటేరియన్లతో అన్నారు.

బంగాళదుంపల కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి 8 మంది మృతి, 11మంది రెస్క్యూ.. శిథిలాల కింద మరికొంత మంది...

అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజులుగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగం మొదటి నాలుగు రోజుల్లో ఉభయ సభలు పెద్దగా కార్యకలాపాలను నిర్వహించలేదు. విదేశీ గడ్డపై భారత్ ను కించపరుస్తున్నారని, విదేశీ జోక్యాన్ని కోరుతున్నారని బీజేపీ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో అంతర్గత రాజకీయాలను లేవనెత్తిన సందర్భాలను గుర్తుచేస్తూ కాంగ్రెస్ అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios