Asianet News TeluguAsianet News Telugu

లైవ్ లో సుప్రీంకోర్టు కార్య‌క‌లాపాలు.. సొంత ప్లాట్‌ఫారమ్ ఉంటుంద‌ని వెల్ల‌డి

Supreme Court: లైవ్ స్ట్రీమ్ హియరింగ్‌లకు సంబంధించి త‌మ‌కు స్వంత ప్లాట్‌ఫారమ్ ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. యూట్యూబ్ వంటి  ప్ర‌యివేటు ప్లాట్‌ఫారమ్‌లకు దాని ప్రొసీడింగ్‌ల కాపీరైట్‌ను అప్పగించలేమని ఒక న్యాయవాది వాదించినప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
 

New Delhi: Supreme Court proceedings in live.. will have its own platform
Author
First Published Sep 26, 2022, 3:30 PM IST

Supreme Court Livestream: సుప్రీంకోర్టు సోమవారం తన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి దాని స్వంత ప్లాట్‌ఫారమ్ కలిగి ఉంటుందని తెలిపింది. అలాగే, ప్ర‌స్తుతం లైవ్ స్ట్రీమింగ్ కోసం యూట్యూబ్ ను ఉపయోగించడం తాత్కాలికమేనని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్‌ల కాపీరైట్‌ను యూట్యూబ్ వంటి ప్ర‌యివేటు ప్లాట్‌ఫారమ్‌లకు అప్పగించలేమని బీజేపీ మాజీ నేత కేఎన్ గోవిందాచార్య తరపు న్యాయవాది వాదించినప్పుడు చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయం చెప్పింది. "యూట్యూబ్ వెబ్‌కాస్ట్‌పై కాపీరైట్‌ను స్పష్టంగా కోరింది" అని న్యాయవాది విరాగ్ గుప్తా న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్-జేప‌బీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.

"ఇవి ప్రారంభ దశలు. మేము ఖచ్చితంగా మా స్వంత ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంటాము... మేము దానిని (కాపీరైట్ సమస్య) చూసుకుంటాము" అని సీజేఐ తెలిపారు. అలాగే, గోవిందాచార్య  దాఖ‌లు చేసిన మధ్యంతర పిటిషన్‌ను అక్టోబర్ 17న విచారణకు జాబితా చేసారు. 2018 తీర్పును ప్రస్తావిస్తూ "ఈ కోర్టులో రికార్డ్ చేయబడిన, ప్రసారం చేయబడిన అన్ని విషయాలపై కాపీరైట్ ఈ కోర్టుకు మాత్రమే ఉంటుంది" అని న్యాయవాది చెప్పారు. అలాగే, యూట్యూబ్ వినియోగ నిబంధనలను కూడా ప్రస్తావించాడు. ఈ ప్రైవేట్ ప్లాట్‌ఫారమ్ కాపీరైట్‌ను కూడా పొందుతుందని చెప్పాడు.

సీజేఐ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఫుల్‌కోర్టు సమావేశం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంలో.. 2018లో ఈ విషయంలో సంచలనాత్మక తీర్పు వెలువడిన దాదాపు నాలుగేళ్ల తర్వాత, సెప్టెంబర్ 27 నుంచి అన్ని రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.  సుప్రీంకోర్టు విచారణలను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు. త‌రువాత వాటిని తన సర్వర్‌లో హోస్ట్ చేయవచ్చు అని సంబంధిత‌ వర్గాలు తెలిపాయి. ప్రజలు తమ సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టు కార్యకలాపాలను యాక్సెస్ చేయగలరని పేర్కొన్నాయి. 

ఆగస్ట్ 26న, దాని ప్రారంభం నుండి మొదటిసారిగా, సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి (రిటైర్డ్ నుండి) ఎన్వీ రమణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కార్యకలాపాలను వెబ్‌కాస్ట్ పోర్టల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. జస్టిస్ రమణ ఆ రోజు పదవీ విరమణ చేయనున్నందున ఇది లాంఛనప్రాయ ప్రక్రియగా కొన‌సాగింది. సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాలు అనేక ముఖ్యమైన కేసులను విచారించాల్సి ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) 10 శాతం కోటాను మంజూరు చేసే 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు, పౌరసత్వ సవరణ చట్ట రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేసే అభ్యర్ధనలు ఇందులో ఉన్నాయి.

కాగా, భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసులపై విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వును సోమ‌వారం ఆమోదించింది.ఈ ఉత్తర్వు సెప్టెంబర్ 27 నుండి అమలు చేయబడుతుందనీ, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల ముందు ఉన్న కేసులను ప్రజలందరికీ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంద‌ని పేర్కొంది. కోర్టు విచారణలను స్ట్రీమింగ్ చేయడం అనేది ఓపెన్ కోర్ట్ సూత్రంకు చెందిన పొడిగింపు అని కోర్టు అంగీకరించిన 2018 ఆర్డర్ ఉన్నప్పటికీ, ఆర్డర్ అమలు కోసం ఇంత స‌మ‌యం ప‌ట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios