Asianet News TeluguAsianet News Telugu

అడుగుపెడితే చంపేస్తా: కాంగ్రెస్ ఎంపీకీ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు వార్నింగ్

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పొలిటికల్ వార్ తారా స్థాయికి చేరుకుంది. నా నియోజకవర్గంలోకి అడుగుపెడితే చంపేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీని బీజేపీ
ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా సెప్టంబర్ 5 నుంచి హట్టా జిల్లాలో నిర్వహించనున్నర్యాలీలో పాల్గొనాలని
నిర్ణయించుకున్నారు. 

I Will Shoot You BJP Lawmakers Son Threatens Jyotiraditya Scindia
Author
Madhya Pradesh, First Published Sep 3, 2018, 8:08 PM IST

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పొలిటికల్ వార్ తారా స్థాయికి చేరుకుంది. నా నియోజకవర్గంలోకి అడుగుపెడితే చంపేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీని బీజేపీ
ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా సెప్టంబర్ 5 నుంచి హట్టా జిల్లాలో నిర్వహించనున్నర్యాలీలో పాల్గొనాలని
నిర్ణయించుకున్నారు. 

అయితే హట్టా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్‌ కుమారుడు ప్రిన్స్‌దీప్‌ లాల్‌చంద్‌ ఖటిక్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఫేస్
బుక్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. జ్యోతిరాదిత్య సింధియా ఎవరైతే ఝాన్సీ రాణిని చంపారో వారి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఒక వేళ నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను నేను చంపేస్తా అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. 

ఆ పోస్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అయితే ఇలాంటి పోస్ట్‌ పెట్టడం దురదృష్టకరమని, సింధియా గౌరవించదగిన ఎంపీ, ఆ పోస్ట్‌ను తొలగించమని నా కుమారుడికి చెబుతానని ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్ తెలిపారు. మరోవైపు సింధియాకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని ఆ రాష్ట్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు రాజా పటేరియా ఆరోపించారు. ఇలాంటి పోస్టులను తీవ్రంగా పరిగణించి తక్షణమే విచారణ చేపట్టాలని, సింధియాకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.  

హరికృష్ణ మృతితోనే జాప్యం: మంత్రివర్గ విస్తరణపై బాబు

టీ.కాంగ్రెస్ నేత శ్రవణ్‌కు లీగల్ నోటీసులు

సెంచరీ దాటిస్తారేమో: పెట్రోల్, రూపాయి క్షీణతపై మోడీపై బాబు సెటైర్

Follow Us:
Download App:
  • android
  • ios