- Home
- National
- Crime : భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. ఏ పేరెంట్స్ చూడకూడని విధంగా కూతుర్ని చూపించిన నీచుడు
Crime : భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. ఏ పేరెంట్స్ చూడకూడని విధంగా కూతుర్ని చూపించిన నీచుడు
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ నీచుడు దారుణానికి పాల్పడ్డాడు. కన్న తల్లిదండ్రులకు కూతురి చావును కళ్లారా చూపిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

కర్ణాటకలో దారుణం
Crime : ఈ కలికాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. ముఖ్యంగా నిండునూరేళ్లు కలిసి జీవించాల్సిన భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. అందుకే ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త, అక్రమ సంబంధానికి నిండు ప్రాణం బలి... ఇలాంటి వార్తలు తరచూ చూడాల్సివస్తోంది. తాజాగా ఇలాంటి దారుణమే పక్కరాష్ట్రం కర్ణాటకలో వెలుగుచూసింది.
కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు దారుణానికి పాల్పడ్డాడు... భార్యను చిత్రహింసలకు గురిచేసి చంపుతూ దాన్నంతా వీడియో తీసుకున్నాడు. అంతటితో అతడి రాక్షసత్వం ఆగలేదు… లైవ్ కాల్ చేసిమరీ కన్న కూతురు ఉరికి వేలాడుతూ విలవిల్లాడుతుండటం ఆ తల్లిదండ్రులకు చూపించాడు. ఇలా కట్టుకున్న భార్యకు నరకం చూపిస్తూ చంపడమే కాదు అత్తామామమకు కన్నకూతురి చావును కళ్లారా చూపించాడు.
భార్యను దారుణంగా హతమార్చిన భర్త
కర్ణాటకలోని బాగల్కోట్లో మనసును కలిచివేసే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కట్టుకున్న భర్తే 23 ఏళ్ల భార్యను ఉరితీసి కిరాతకంగా చంపేశాడు. ఉరితాడుకు వేలాడుతూ ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసి కూతురి చావును ప్రత్యక్షంగా చూపించాడు. ఈ దారుణానికి పాల్పడిన భర్త ప్రవీణ్ జిగలూరును పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని భాగ్యశ్రీగా గుర్తించారు.
భార్యభర్తల మధ్య గొడవేంటి?
కుటుంబ కలహాల కారణంగా భాగ్యశ్రీ అనే వివాహిత గత రెండు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆమె భర్త ప్రవీణ్ ఇటీవలే భార్యతో పాటు అత్తింటివారిని ఒప్పించి కాపురానికి తీసుకెళ్లాడు. భార్యను బాగా చూసుకుంటానని... ఎలాంటి గొడవలు జరగవని మాటిచ్చాడు. భర్త మాటలు నమ్మిన భాగ్యశ్రీ గత ఆదివారమే పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లింది.
అయితే భాగ్యశ్రీ ఇంటికి వచ్చిన రోజు సాయంత్రమే ప్రవీణ్ తో మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు మానవ మ్రుగంగా మారాడు... కర్రతో విచక్షణారహితంగా భార్యను చితకబాదాడు... ఆ తర్వాత గదిలోని ఫ్యాన్కు ఉరివేశాడు. భాగ్యశ్రీ ఊపిరాడక ప్రాణాల కోసం పోరాడుతుండగా ఆ దృశ్యాలను తన మొబైల్లో రికార్డ్ చేశాడు. వెంటనే భాగ్యశ్రీ తల్లిదండ్రులకు కాల్ చేసి, వాళ్ల కూతురు చనిపోతున్న దృశ్యాలను లైవ్లో చూపించాడు. ఈ వీడియోను తన స్నేహితులకు, బంధువులకు కూడా పంపాడు.
వారి పెళ్లి సమయంలో గోడపై రాసిన పేర్ల ముందే ఈ ఘోరం జరగడం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న బిళగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించి, దర్యాప్తును వేగవంతం చేశారు.

