గుజరాత్ ఎన్నికలు: ₹290 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యం స్వాధీనం.. 2017తో పోలిస్తే 10 రెట్లు అధికం
Gandhinagar: ఎన్నికలు జరుగుతున్న గుజరాత్లో ఇప్పటివరకు ₹ 290 కోట్లకు పైగా విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, ఫ్రీబీలు స్వాధీనం చేసుకున్నారు. ఇది మొత్తం 2017 అసెంబ్లీ ఎన్నికల కాలంలో రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్నదాని కంటే 10 రెట్లు ఎక్కువని ఎన్నికల సంఘం ప్రకటించింది.
Gujarat Assembly Elections: గుజరాత్ ఎన్నికల క్రమంలో రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదు, డ్రగ్స్ భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. గుజరాత్ లో మొదటి దశ పోలింగ్ కు ముందు ఇప్పటివరకు ₹ 290 కోట్లకు పైగా విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, ఫ్రీబీలు స్వాధీనం చేసుకున్నారు. ఇది మొత్తం 2017 అసెంబ్లీ ఎన్నికల కాలంలో స్వాధీనం చేసుకున్నదాని కంటే 10 రెట్లు ఎక్కువని ఎన్నికల సంఘం ప్రకటించింది.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమలవుతోంది. అయితే, పలు పార్టీలు వీటిని ఉల్లంఘిస్తూ.. నగదు, మద్యం పంచుతూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికలకు సంబంధించిన నిషిద్ధ వస్తువుల స్వాధీనం 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే పదిరెట్లు ఎక్కువ అని రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం జప్తులు ₹27.21 కోట్లు కాగా, ఈసారి, నవంబర్ 29 వరకు జప్తు చార్ట్ ₹290.24 కోట్లుగా ఉంది. అంటే గతంలో పోలిస్తే.. 10.66 రెట్లు ఎక్కువ జప్తులను నమోదు చేసినట్లు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
వడోదర (గ్రామీణ), వడోదర సిటీలో ఇప్పటికీ కొనసాగుతున్న ఒక ముఖ్యమైన నిర్బంధం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ యూనిట్లను గుర్తించిన తర్వాత, సుమారు ₹478 కోట్ల విలువైన 143 కిలోల సింథటిక్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మరో చోట 500 కోట్ల రూపాలయ విలువ చేసే ఎండీ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనుండగా, 89 నియోజకవర్గాల్లో 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
భారత ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్ లో ఇప్పటివరకు ₹ 27.07 కోట్ల నగదు, ₹ 14.88 కోట్ల విలువైన మద్యం, ₹ 61.96 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, ₹ 15.79 కోట్ల విలువైన లోహాలు, ₹ 171.24 కోట్ల విలువైన ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 143 కిలోల మాదకద్రవ్యాల విలువను దీనికి జోడిస్తే, రాష్ట్రంలో జప్తు చేయబడిన మొత్తం నిషేధిత వాటి విలువ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 28 రెట్లు పెరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. "స్వాధీనం చేసుకున్న గణాంకాలు గణనీయంగా పెరగడం వెనుక ఎన్నికల సంఘం సమగ్ర వ్యూహం, వివరణాత్మక ప్రణాళిక, కఠినమైన అనుసరణలు ఉన్నాయి" అని భారత ఎన్నికల సంఘం పేర్కొంది.
బలమైన వ్యూహాత్మకంగా ఈసీ చర్యలు..
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుకుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఎన్నికలకు ఓటింగ్ తేదీలను ప్రకటించినప్పుడు, ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్.. ప్రేరేపణ రహిత ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో గణనీయమైన మొత్తంలో జప్తులను ఉదహరించారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల నుండి సరిహద్దు దాటి నగదు, మద్యం, ఉచిత వస్తువుల తరలింపును అరికట్టేందుకు పోలింగ్ రోజు వరకు సమర్థవంతమైన, పటిష్టమైన చర్యలకు సంబంధించి CEC గట్టిగా ఆదేశాలు జారీ చేసింది. సీజ్లను రాష్ట్రాల వారీగా విశ్లేషించాలని చీఫ్ సెక్రటరీలు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్లను ఆయన ఆదేశించారు. సీజ్ లపై రాష్ట్రాల వారీగా విశ్లేషణ చేయాలని, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలపై చర్యలు తీసుకోవాలని సీఈసీ ప్రధాన కార్యదర్శులు, పోలీసు డైరెక్టర్ జనరల్స్ ను ఆదేశించారు.