కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్
దేశంలోని ప్రతి ఇంటికి 2024 నాటికి మంచినీళ్లు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ తరహలోనే ప్రతి ఇంటికి నీటిని అందించేందుకు కేంద్రం నడుం బిగించింది.
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఇంటికి 2024 నాటికి మంచినీళ్లు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ తరహలోనే ప్రతి ఇంటికి నీటిని అందించేందుకు కేంద్రం నడుం బిగించింది.
శుక్రవారం నాడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించనున్నట్టు ఆమె ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ భగీరథ తరహాలోనే హర్ ఘర్ జల్ పేరుతో ఈ పథకాన్ని పిలుస్తున్నారు.దేశంలోని సుమారు 600కు పైగా జిల్లాల్లో మంచినీటి కొరత ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందించనున్నట్టు మంత్రి ప్రకటించారు.
సంబంధిత వార్తలు
కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్కు నిర్మల శుభవార్త
కేంద్ర బడ్జెట్ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్
కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు
నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు