Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

దేశంలోని దుకాణ యజమానులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు  ప్రకటించింది.

Nirmala Sitharaman launches new pension scheme for small retail traders
Author
New Delhi, First Published Jul 5, 2019, 11:58 AM IST

న్యూఢిల్లీ: దేశంలోని దుకాణ యజమానులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు  ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో  దుకాణదారులకు కొత్త పెన్షన్ స్కీమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టుగా ప్రకటించింది.చిన్న రిటైల్ ట్రేడర్స్‌కు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు.   కొత్త పెన్షన్ స్కీమ్ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని  ఆమె చెప్పారు.  

ఏటా రూ.1.5 కోట్ల టర్నోవర్  ఉన్న దుకాణదారులకు ఈ స్కీమ్ పరిధిలోకి వస్తారని  ఆమె ప్రకటించారు. ఈ పథకానికి  ప్రధానమంత్రి కర్మ యోగి మాన్ ధన్ స్కీమ్ అని పేరు పెట్టినట్టుగా  మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

Follow Us:
Download App:
  • android
  • ios