MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • తాతా.. నువ్వు తోపు అంతే ! బ్రిటన్ సామ్రాజ్యానికే అప్పు ఇచ్చిన భారతీయుడు

తాతా.. నువ్వు తోపు అంతే ! బ్రిటన్ సామ్రాజ్యానికే అప్పు ఇచ్చిన భారతీయుడు

World War 1 : మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం సెహోర్‌కు చెందిన సేథ్ జుమ్మా లాల్ వద్ద తీసుకున్న రూ. 35,000 అప్పును, వడ్డీతో కలిపి కోట్లలో చెల్లించాలని ఆయన మనవడు వివేక్ రుతియా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 27 2026, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బ్రిటిష్ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్న మధ్యప్రదేశ్ ఫ్యామిలీ.. ఆ పత్రం చూస్తే మైండ్ బ్లాక్
Image Credit : X/iamankitpande

బ్రిటిష్ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్న మధ్యప్రదేశ్ ఫ్యామిలీ.. ఆ పత్రం చూస్తే మైండ్ బ్లాక్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సుమారు 109 ఏళ్ల క్రితం నాటి ఒక అప్పు వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 1917వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక భారతీయ వ్యాపారి వద్ద నుంచి తీసుకున్న అప్పును ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆయన వారసులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వింతగా అనిపించినా.. చారిత్రక ప్రాధాన్యం ఉన్న కేసు ఇప్పుడు న్యాయ నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
యుద్ధ కాలంలో ఆర్థిక సహాయం
Image Credit : our own

యుద్ధ కాలంలో ఆర్థిక సహాయం

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యుద్ధ వ్యయం పెరిగిపోవడంతో నిధుల కోసం అప్పటి ప్రభుత్వం స్థానిక సంపన్న వ్యాపారుల సహాయాన్ని కోరింది. ఆ సమయంలో సెహోర్‌లో ప్రముఖ వ్యాపారిగా పేరుగాంచిన సేథ్ జుమ్మా లాల్ రుతియాను బ్రిటిష్ అధికారులు సంప్రదించారు. మానవతా దృక్పథంతో, అప్పటి పరిస్థితులను బట్టి ఆయన 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి రూ. 35,000 నగదును అప్పుగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు అధికారిక పత్రాలను కూడా అందజేసింది.

Related Articles

Related image1
సచిన్ టెండూల్కర్ అన్‌స్టాపబుల్ రికార్డులు.. వీటిని టచ్ చేయడం కూడా కష్టమే !
Related image2
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
36
మరచిపోయిన బాధ్యత.. తరాలు మారిన పత్రాలు
Image Credit : X/mishra_abhi

మరచిపోయిన బాధ్యత.. తరాలు మారిన పత్రాలు

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటన్ విజయం సాధించినప్పటికీ, ఆ దేశం ఆర్థికంగా కుదేలైంది. ఆ వెంటనే రెండో ప్రపంచ యుద్ధం రావడం, తదనంతరం 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ గందరగోళంలో బ్రిటిష్ ప్రభుత్వం తాను తీసుకున్న అప్పును తీర్చడం మరచిపోయింది. సేథ్ జుమ్మా లాల్ 1937లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం ఆ పత్రాలను ఆయన కుమారుడు సేథ్ మనక్ చంద్ రుతియా భద్రపరిచారు. 2013లో మనక్ చంద్ మరణించిన తర్వాత, ఆ చారిత్రక పత్రాలు ఆయన కుమారుడు వివేక్ రుతియా చేతికి చిక్కాయి. ఇటీవల ఒక కుటుంబ చర్చలో ఈ విషయం ప్రస్తావనకు రావడంతో, దీనిపై న్యాయపోరాటం చేయాలని వివేక్ నిర్ణయించుకున్నారు.

46
అప్పుడు 35 వేలు.. ఇప్పుడు దాని విలువ కోట్లలో..
Image Credit : our own

అప్పుడు 35 వేలు.. ఇప్పుడు దాని విలువ కోట్లలో..

వివేక్ రుతియా తెలిపిన ప్రకారం.. బ్రిటిష్ ప్రభుత్వం తమ కుటుంబానికి ఇవ్వాల్సిన ఈ అప్పును ఎప్పుడూ తీర్చడానికి ప్రయత్నించలేదు. 1917 నాటి రూ. 35,000 విలువ నేటి ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ ప్రకారం లెక్కిస్తే కేవలం అసలు మొత్తమే సుమారు రూ. 1.85 కోట్లకు సమానం అవుతుంది. దీనికి 109 ఏళ్ల వడ్డీని కూడా కలిపితే ఆ మొత్తం కొన్ని పదుల కోట్లకు చేరుతుందని అంచనా. "ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది న్యాయం, చారిత్రక బాధ్యతకు సంబంధించిన విషయం" అని వివేక్ పేర్కొన్నారు. తన వద్ద ఉన్న వీలునామా, బ్రిటిష్ కాలం నాటి రశీదులే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.

56
బ్రిటిష్ ప్రభుత్వానికి నోటీసులు
Image Credit : Getty

బ్రిటిష్ ప్రభుత్వానికి నోటీసులు

ఈ చారిత్రక ఆర్థిక బకాయిని వసూలు చేసేందుకు వివేక్ రుతియా ఇప్పుడు సిద్ధమవుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి త్వరలోనే న్యాయపరమైన నోటీసులు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఒక సార్వభౌమ దేశం తన గత బాధ్యతలను లేదా అప్పులను విస్మరించడానికి వీలులేదని ఆయన వాదిస్తున్నారు. తన తాత ఇచ్చిన సామాజిక, ఆర్థిక సహకారానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభించాలని ఆయన కోరుతున్నారు. ఈ కేసును అవసరమైతే అంతర్జాతీయంగా కూడా ప్రస్తావిస్తానని ఆయన స్పష్టం చేశారు.

66
న్యాయ నిపుణులు ఏమంటున్నారు?
Image Credit : Getty

న్యాయ నిపుణులు ఏమంటున్నారు?

ఈ వ్యవహారంపై న్యాయ నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ కేసు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (International Court of Justice) వరకు వెళ్లే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, శతాబ్దం క్రితం నాటి పత్రాల ప్రామాణికతను నిరూపించడం అంత సులభం కాదని వారు హెచ్చరిస్తున్నారు. చట్టపరమైన కాలపరిమితి వంటి అంశాలు ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, ఒక కుటుంబం తమ పూర్వీకుల హక్కుల కోసం ఒక శక్తివంతమైన దేశంపై పోరాటానికి సిద్ధమవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వైరల్ న్యూస్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Recommended image2
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image3
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Related Stories
Recommended image1
సచిన్ టెండూల్కర్ అన్‌స్టాపబుల్ రికార్డులు.. వీటిని టచ్ చేయడం కూడా కష్టమే !
Recommended image2
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved