అగ్నిపథ్ పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం సమీక్షిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆ సమయంలో బయటపడే లోపాలను సరి చేస్తుందని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలు ఈ పథకంపై చర్చలు జరిపామని అన్నారు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆర్మీ ఉద్యోగార్థ అభ్యర్థుల్లో అలాగే దేశ వ్యాప్తంగా అనేక విద్యావంతుల్లో కూడా ఈ పథకంపై అనేక ఆపోహలు, అనుమానాలు ఉన్నాయి. వీటిని తొలగించే విషయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. సైనిక నియామక ప్రణాళికను ప్రభుత్వం వార్షిక ప్రాతిపదికన సమీక్షిస్తూనే ఉంటుందని తెలిపారు. ఏవైనా లోపాలు, సవాళ్లు ఎదురైతే వాటిని పరిష్కరిస్తుందని చెప్పారు.
తప్పిన ముప్పు: యూపీ సీఎం యోగి ప్రయాణీస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
కొత్త మోడల్ను ‘‘ట్రాన్స్ఫార్మేటివ్’’ గా అభివర్ణించిన రాజ్ నాథ్ సింగ్.. దాదాపు రెండు సంవత్సరాల అనేక మంది నిపుణులతో విస్తృతంగా చర్చించిన తరువాత ఈ పథకాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. ‘‘ఈ పథకాన్ని అమలు చేయనివ్వండి. మేము ప్రతి సంవత్సరం దీనిని సమీక్షిస్తూనే ఉంటాము. ఏవైనా లోపాలు లేదా సవాళ్లను కనుగొంటే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాము. ఇది మా ప్రభుత్వ నిబద్ధత ’’ అని రక్షణ మంత్రి చెప్పారని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
Delhi bypoll results: ఢిల్లీ ఉప ఎన్నికల ఫలితాలు.. రాజిందర్ నగర్లో ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ఆఫ్
ఈ పథకం సాయుధ దళాల నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. జూన్ 14వ తేదీన ఆవిష్కరించిన ఈ పథకం ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. నాలుగేళ్ల పాటు వీరు త్రివిధ దళాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఇందులో 25 శాతం అగ్నివీర్ లను మరో 15 ఏళ్ల పాటు విధుల్లో ఉంచుకుంటారు. మిగితా అగ్నివీర్ లకు ప్యాకేజీ అందిస్తారు.
ఈ పథకంలో లోపాలు ఉన్నాయంటూ దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఇవి తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఆర్మీ ఉద్యోగార్థులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. టైర్లకు నిప్పు పెట్టారు. రైలు పట్టాలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే రైలు బోగీలకు కూడా మంట పెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించింది. కేంద్ర బలగాల్లో అగ్నీవర్ లకు 10 శాతం కోటా కల్పిస్తామని చెప్పింది. అలాగే మొదటి రిక్రూట్ మెంట్ సమయంలో రెండేళ్లు వయో పరిమితి కల్పిస్తామని తెలిపారు.
FASTag Viral Video: FASTag స్కాన్ చేసి డబ్బు కొట్టేయొచ్చా? Video Viral ..
కాగా యువత గొంతును ప్రభుత్వం విస్మరించడం దురదృష్టకరమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ పథకాన్ని ఉద్దేశించి అన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం ఉపసంహరణకు తాము కృషి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. త్రివిధ దళాల అధిపతులు మంగళవారం వేర్వేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ పథకం అమలుకు సంబంధించిన తమ ప్రణాళికను వివరించారు.