Asianet News TeluguAsianet News Telugu

ఫోర్న్ వీడియో చూపించి.. కొత్తగా ట్రై చేద్దామని, రెచ్చగొట్టి.. నాలుగో భార్య చేసిన దారుణం.. !!

శృంగారంలో కొత్త యాంగిల్ ట్రై చేద్దామని భర్తను రెచ్చగొట్టి.. కాళ్లూ చేతులు కట్టేసి కసిదీరా పొడిచి చంపిందో భార్య. 30యేళ్ల మహిళ 65ఐదేళ్ల భర్తను దారుణంగా చంపిన ఘటన మహారాష్ట్ర నాగ్ పూర్ లో జరిగింది. 

Fourth wife uses porn to lure man, into kinky sex trap, stabs him to death in Nagpur - bsb
Author
Hyderabad, First Published Mar 26, 2021, 10:28 AM IST

శృంగారంలో కొత్త యాంగిల్ ట్రై చేద్దామని భర్తను రెచ్చగొట్టి.. కాళ్లూ చేతులు కట్టేసి కసిదీరా పొడిచి చంపిందో భార్య. 30యేళ్ల మహిళ 65ఐదేళ్ల భర్తను దారుణంగా చంపిన ఘటన మహారాష్ట్ర నాగ్ పూర్ లో జరిగింది. 

మార్చి 8 మహిళా దినోత్సవం రోజు జరిగిన ఈ దారుణం ఆలస్యంగావెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమె అతడికి నాలుగో భార్య కాగా, అతడు ఆమెకు మొదటి భర్త. 

వివరాల్లోకి వెడితే..  నాగ్ పూర్ కు చెందిన లక్ష్మణ్ మాలిక్ (65) ఈఐఎస్ సీ ఆస్పత్రిలో ఉద్యోగి. 2011లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతనికి సెక్స్ వాంఛలు ఎక్కువ. దీనికి తోడు డబ్బుకు కొరత లేదు. దీంతో ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. 

అందరితోనూ కాపురం చేస్తున్నాడు. అందర్నీ వేరు వేరు ఇళ్లలో పెట్టాడు. నిందితురాలు స్వాతి మాలిక్ అలియాస్ స్వాతి శర్మ లక్ష్మణ్ కు నాలుగో భార్య. ఈమె నాగ్ పూర్ లో బొటిక్ నడుపుతుంది. ఐదేళ్ల క్రితం వీరికి ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య శారీరకసాన్నిహిత్యానికి దారి తీసింది.. దీంతో పెళ్లికూడా చేసుకున్నారు. అయితే స్వాతితో పెళ్లైన కొంత కాలానితే లక్ష్మణ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. 

ఆ తర్వాత 2018లో స్వాతి శర్మ షాపులో పనిచేసే ఓ మైనర్ బాలికతోనూ లక్ష్మణ్ పరిచయం పెంచుకున్నాడు. ఇది స్వాతికి నచ్చలేదు. మాలిక్ ప్రవర్తనతో విసుగు చెంది.. అతడికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. అంతేకాదు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 

అయితే మాలిక్ కి దూరంగా ఉన్నా అతని పెన్షన్ డబ్బులు స్వాతినే తీసుకునేది. దీంతో మాలిక్ ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఎలాగైనా మాలిక్ బాధ తప్పించుకోవాలని అనుకున్న స్వాతి.. ఓ రహస్య ప్రదేశానికి రావాలని చెప్పింది. అక్కడికి వచ్చిన మాలిక్ కు తన ఫోన్లో ఓ పోర్న్ వీడియో చూపించి.. అలా కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పింది.

మాలిక్ కూడా ఎగ్జైట్ అయి ఒప్పుకున్నాడు. ఆ తరువాత మాలిక్ ను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు, చేతులు నైలాన్ తాడుతో వెనక్కి కట్టేసింది. ఆ తరువాత కసిదీరా అతడ్ని పొడిచింది. మాలిక్ ప్రాణం పోయేవరకు అక్కడే ఉండి, ఆ తరువాత గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయింది. 

అతనితో ఎప్పుడో విడిపోయింది. వేరేపెళ్లి చేసుకుంది. తను కలుస్తున్నట్టు కూడా ఎవ్వరికీ తెలియదు.. కాబట్టి తనమీద అనుమానం రాదనుకుంది స్వాతి. అయితే మాలిక్ హత్యతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. ముందు ఎవరైనా శత్రువులో, దొంగలో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనిభావించారు. 

వారి ఫిర్యాదులో దర్యాప్తు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేశారు. మొత్తం 180 మందిని ప్రశ్నించారు. ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. అయితే దర్యాప్తులో స్వాతి ఇచ్చే సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios