సారాంశం

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్, ఆదాయపు పన్ను శాఖ లో ఎన్డీఏలో ఉన్న బలమైన పార్టీలు అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

ఎన్డీఏ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ లే  మూడు బలమైన పార్టీలుగా ఉన్నాయని శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఆ పార్టీ పత్రిక మౌత్ పీస్ 'సామ్నా' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ‘పీటీఐ’ పేర్కొంది.  ఈ సందర్భంగా మణిపూర్లో జాతి కలహాల విషయంలో కేంద్ర అనుసరిస్తున్న తీరును విమర్శించారు.

ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో పరిచయం.. మహిళను హోటల్ కు పిలిపించి అత్యాచారం..

ఇటీవల జరిగిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సమావేశంపై ఠాక్రే మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీకి తమ ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అని గుర్తొస్తుందని అన్నారు. ఎన్నికలు ముగిశాక మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు అధికార బీజేపీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

పబ్జీతో మొదలైన స్నేహం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం.. ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి..

యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై ఠాక్రే మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోవధ నిషేధం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుగా చట్టం తీసుకురావాలని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే అయితే బీజేపీలో అవినీతిపరులను కూడా శిక్షించాలని ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఠాక్రే కుటుంబం ఉన్నదే నిజమైన శివసేన అని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తరచూ వీడియోలు పెడుతోందని చెల్లెలి హత్య.. భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన

శివసేనలో చీలికకు కారణమైన వారు అది నాశనమవుతుందని భావించారని, కానీ అది మళ్లీ పెరుగుతోందని ఠాక్రే అన్నారు. తిరుగుబాటు చేసిన చాలా మంది అనుభవజ్ఞులు చాలా కాలంగా తమ స్థానాలను ఆక్రమించుకున్నారని, ఇప్పుడు వారి స్థానంలో కొత్తవారికి అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.  మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ న్యాయం చేయకపోతే తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని తెలిపారు. 

హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తనపై ఐసీసీ ఆగ్రహం.. రెండు మ్యాచ్ ల నిషేధం

కాగా.. గత ఏడాది జూన్ లో ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండేతో పాటు మరో 39 మంది శాసనసభ్యులు శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలో చీలిక వచ్చి ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో షిండే ముఖ్యమంత్రి అయ్యారు.