సారాంశం
పబ్జీ గేమ్ తో ఆ ఇద్దరి పరిచయం ఏర్పడింది. అనంతరం వారిద్దరూ ఒకే చోట ఉద్యోగంలో చేరి, తమ స్నేహాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ఆ మహిళ ‘పబ్జీ’ గేమ్ ఆడేది. ఈ క్రమంలో అందులో రెండున్నరేళ్ల కిందట ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది. తరువాత వారిద్దరూ ఒకే దగ్గర ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు. అనంతరం ముఖం చాటేశాడు. పైగా ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఇద్దరు మహిళ కార్మికుల మృతి.. భీతావహంగా మారిన ఘటనా స్థలి..
వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబాయికి చెందిన 33 ఏళ్ల మహిళకు పబ్జీ గేమ్ గేమ్ ఆడుతుండేది. అయితే ఆ గేమ్ లో రెండున్నర సంవత్సరాల కిందట ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి పరిచయం స్నేహంగా మారింది. తరువాత ఇద్దరూ అనుకొని ఒకే సంస్థలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తరచూ వీడియోలు పెడుతోందని చెల్లెలి హత్య.. భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
ఈ సందర్భంగా ఆ మహిళపై అతడికి వ్యామోహం కలిగింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆ మహిళకు ఓ షాకింగ్ విషయం చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకోబనని తేల్చి చెప్పాడు. కానీ మళ్లీ తనతో మునపటిలాగే ఉండాలని కోరారు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో అతడు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తనతో సన్నిహితంగా ఉండకపోతే గతంలో ఏకాంతంగా ఉన్న వీడియోలను తాను రికార్డు చేసి ఉంచానని, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.
'ఢిల్లీ ఆర్డినెన్స్' స్థానంలో బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
అతడి వేధింపులను కొంత కాలం భరించిన ఆమె.. వాటిని తట్టుకోలేకపోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు.