దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వల్ల అవినీతిపరులు తప్పించుకుంటున్నారు - కాంగ్రెస్
కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేయడం వల్ల నిజాయితీ పరులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కొన్ని సార్లు సంస్థలు నిజాయితీ చేసే పనులను కూడా అనుమానించాల్సి వస్తోందని తెలిపింది.
రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఏజన్సీలను కనికరం లేకుండా దుర్వినియోగం చేయడం వల్ల దాని విశ్వసనీయత దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ శనివారం ఆరోపించింది. ఈ పరిణామాల వల్ల అవినీతిపరులు కూడా తప్పించుకునే అవకాశం ఉందని పేర్కొంది.
కూతురు మొదటి పుట్టిన రోజు సందర్భంగా 1.01 లక్షల పానీపూరీలను ఫ్రీగా పంచిపెట్టిన వ్యాపారి..
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు జరిగిన వెంటనే కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రక్రియల్లో నిజాయితీపరులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.
‘‘ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఏజెన్సీలను కనికరం లేకుండా దుర్వినియోగం జరుగుతోంది. దీని వల్ల వెనకవైపు ఏజెన్సీల చట్టబద్ధమైన, సరైన చర్యలను కూడా అనుమానించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అవినీతిపరులు ‘దుర్వినియోగం’ వాదన వెనుక దాక్కుంటారు. నిజాయితీపరులు డబ్బు చెల్లించవలసి ఉంటుంది ’’ అని పవన్ ఖేరా ట్విట్టర్లో పేర్కొన్నారు.
తల్లి పాలు తాగడం మానేసిన 8 నెలల పిల్లాడు.. ఎక్స్ రే తీస్తే షాకింగ్ విషయం వెలుగులోకి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సీబీఐ మనీష్ సిసోడియా, ఐఏఎస్ అధికారి అరవ గోపీ కృష్ణ నివాసాలతో పాటు మరో 19 ప్రాంతాల్లో సోదాలు శుక్రవారం సోదాలు నిర్వహించింది.
సీబీఐ రైడ్ ను మనీష్ సిసోడియా స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘‘ సీబీఐ వచ్చింది. వారికి స్వాగతం. మేము చాలా నిజాయితీగా ఉన్నాం. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం. మన దేశంలో మంచి పనులు చేసే వారిని ఇలా వేధించడం చాలా దురదృష్టకరం. అందుకే మన దేశం ఇంకా నంబర్-1గా మారలేదు. ’’ అని పేర్కొన్నారు. “మేము సీబీఐని స్వాగతిస్తున్నాము. త్వరలో నిజానిజాలు బయటకు వచ్చేలా విచారణకు పూర్తి సహకారం అందిస్తాం. ఇప్పటి వరకు నాపై ఎన్నో కేసులు పెట్టారు. ఒక్కటి కూడా రుజువు కాలేదు. దీని నుంచి కూడా ఏమీ రాదు. దేశంలో మంచి విద్య కోసం నేను చేస్తున్న కృషిని ఆపలేరు.’’ అని ఆయన మరో ట్వీట్ లో తెలిపారు.
చెన్నైలో రూ. 20కోట్ల నగల దోపిడీలో ట్విస్ట్.. ఇన్ స్పెక్టర్ ఇంట్లో 3.7 కిలోల బంగారం..!
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. “ ఢిల్లీ విద్య, ఆరోగ్యం కోసం మేము చేస్తున్న అద్భుతమైన పనిని చూసి కొందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఎడ్యుకేషన్ హెల్త్ అనే మంచి పనిని ఆపడానికి ఢిల్లీలోని ఆరోగ్య మంత్రి, విద్యా మంత్రిని అరెస్టు చేశారు. మా ఇద్దరిపై తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో నిజం బయటపడుతుంది ’’ అని ఆయన చెప్పారు.