కాంగ్రెస్ అధ్యక్షుడినైతే నా చేతిలోనే రిమోట్ కంట్రోల్ ఉంటుంది - మల్లికార్జున్ ఖర్గే
బీజేపీలాగా కాంగ్రెస్ లో రిమోట్ కంట్రోల్ వంటిదేదీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత, అధ్యక్ష పదవి బరిలో ఉన్న మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తాను ఎవరి చేతిలో రిమోట్ కంట్రోల్ కాబోనని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ చీఫ్ గా తన చేతిలోనే రిమోట్ కంట్రోల్ ఉంటుందని, తాను ఎవరి చేతిలోనూ రిమోట్ కంట్రోల్ కాబోనని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అక్టోబరు 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి మద్దతు సేకరించేందుకు ఆయన పలు రాష్ట్రాల్లో సందర్శిస్తున్నారు. ఈ పర్యటనను ఆయన శుక్రవారం గుజరాత్ లోని అహ్మదాబాద్లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లాగా కాంగ్రెస్ పార్టీలో ‘రిమోట్ కంట్రోల్’ లాంటిది ఏమీ లేదని ఖర్గే అన్నారు, అందులో (బీజేపీ) ప్రతి అధ్యక్షుడిని ‘ఏకాభిప్రాయం’ ద్వారా ఎంపిక చేస్తారని చెప్పారు.
90 వసంతాల భారత వైమానిక దళం.. యుద్దరంగంలో దిగితే.. వీరోచిత పోరాాటమే.. ఎయిర్ఫోర్స్ బలాబలాలు
అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత సోనియా గాంధీకి రిమోట్ కంట్రోల్గా, ప్రాక్సీగా వ్యవహరిస్తారని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై మీడియా అడిగి ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘ మా కమిటీ, ఎన్నికైన సభ్యులు, వర్కింగ్ కమిటీ, ప్రైమరీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటాయి. నేను రిమోట్ కంట్రోల్ అని, వెనుక నుండి పనిచేస్తానని చాలా మంది చెబుతారు. సోనియా గాంధీ చెప్పినట్లు నేను చేస్తాను అని వారు అంటున్నారు. కాంగ్రెస్ లో రిమోట్ కంట్రోల్ వంటిది ఏదీ లేదు, ప్రజలు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ ఆలోచన. కొంతమంది వ్యక్తులు ఈ ఆలోచనను సృష్టిస్తున్నారు. ’’ అని ఆయన అన్నారు.
పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే సంస్కృతి బీజేపీకి లేదని ఆయన విమర్శించారు. ‘‘ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడానికి ప్రధాని ఎన్నిసార్లు చొరవ తీసుకున్నారు? వాస్తవానికి బీజేపీ అధ్యక్షులందరూ ఏకాభిప్రాయం ద్వారా ఎన్నుకుంటారు. ఇప్పుడు ఏ పార్టీ రిమోట్ కంట్రోల్ కలిగి ఉందో మీరే నిర్ణయించుకోండి?’’ అని ఆయన అన్నారు.
ఈసీని రాజకీయ రంగంలోకి లాగకూడదు - మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురైషీ
పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే సంస్కృతి బీజేపీకి లేదని ఆయన విమర్శించారు. “పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు ప్రధాని ఎన్నిసార్లు చొరవ తీసుకున్నారు? నిజానికి బీజేపీ అధ్యక్షులందరూ ఏకాభిప్రాయంతో ఎన్నికైనవారే. ఇప్పుడు, ఏ పార్టీ రిమోట్ కంట్రోల్ని ఉపయోగించాలో మీరే నిర్ణయించుకోండి? ’’ అని ఆయన చెప్పారు.
సంస్థాగత పోస్టుల్లో 50 ఏళ్లలోపు వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఖర్గే చెప్పారు. తాను పార్టీ అధ్యక్షుడైతే పార్టీలోని ప్రతి స్థాయిలో మహిళలు, యువత, దళితులు, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర యూనిట్లకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. నా పార్టీ సిద్ధాంతాలను, గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలను కాపాడేందుకు, సర్దార్ పటేల్ ఇచ్చిన ఐక్యత పిలుపును బలోపేతం చేసేందుకు తాను ఎన్నికల బరిలోకి దిగానని అన్నారు.
పార్టీ కార్యకర్తను పెళ్లి చేసుకున్న ఆప్ మహిళా ఎమ్మెల్యే...
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు నేతలు పోటీలో నిలిచారు. ప్రస్తతం మల్లికార్జున ఖర్గేకు పోటీగా మరో సీనియర్ నేత శశిథరూర్ బరిలో ఉన్నారు. అక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 19వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.