ఒక్క రోజులో జీవితం మారుతుందా.? అంటే అంత సులభమైన విషయం కాదని చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ వ్యక్తి జీవితం మాత్రం ఒక్క రోజులోనే మారింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.? ఆయన జీవితం ఎలా మారింది.? ఇప్పుడు తెలుసుకుందాం..
56 సంవత్సరాల వయస్సులో చాలా మంది తమ జీవితం ఇక చేసేది ఏం లేదని అనుకుంటారు. కానీ ఇలాంటి వయసులో ఓ వ్యక్తి జీవితం మారిపోయింది. చెన్నైలో నివసించే రిటైర్డ్ ఇంజనీర్ శ్రీరామ్ రాజగోపాలన్ జీవితం ఒక్కరోజులో మారింది. ఆయన చేసిన ఓ పని అతని జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసింది. ఎమిరేట్స్ డ్రా లో రూ. 231 కోట్ల జాక్పాట్ గెలిచారు.
ఈ అద్భుతం 2025 మార్చి 16న జరిగింది. ఆ రోజు శ్రీరామ్ పుట్టిన రోజు కావడం విశేషం. అంతేకాదు తన తల్లి పుట్టిన రోజుకు సరిగ్గా ఆరు రోజుల తర్వాత లక్కీ డ్రా వరించడం మరో విశేషంగా చెప్పొచ్చు. అప్పటివరకు ఎన్నోసార్లు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన ఆయనకు అదృష్టం మాత్రం వరించలేదు. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న అన్ని 7 నంబర్లు కూడా ఎమిరేట్స్ డ్రా సరిపోవడంతో విజయం వరించింది. జీవితంలో ఏదైనా జరగొచ్చనే గొప్ప నిజాన్ని ఈ సంఘటన ప్రపంచానికి తెలియజేసింది.
శ్రీరామ్ ఒక రోజు తన మొబైల్ఫోన్లో స్టైలస్తో కళ్లుమూసుకొని యాదృచ్ఛికంగా నంబర్లు ట్యాప్ చేసి ఒక టికెట్టి ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వచ్చిన ఓ ఫోన్ కాల్ శ్రీరామ్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఎమిరేట్స్ డ్రాలో రూ. 231 కోట్లు గెలుచుకున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న శ్రీరామ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సంతోషాన్ని ఆయన పంచుకుంటూ.. “ఆ వార్తను మొదట నమ్మలేకపోయాను. డ్రా వీడియోను తిరిగి చూశాను, స్క్రీన్షాట్ కూడా తీసుకున్నాను!” అని చెప్పుకొచ్చారు.
తల్లితో అనుబంధం:
తన జీవితంలో తల్లి పాత్ర ఎంతో ఉందని చెప్పారు శ్రీరామ్. తన జీవితానికి బలమైన ఆధారం తన తల్లి అని చెప్పుకొచ్చారు. “అమ్మ ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోకూడదని నేర్పింది. ఏ పరిస్థితుల్లో అయినా ముందుకెళ్లాలనే ధైర్యం ఆమె వల్లే వచ్చింది.” అని తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
శ్రీరామ్ జీవన ప్రయాణం:
శ్రీరామ్ 1998లో సౌదీ అరేబియాకు వెళ్లి జీవనం సాగిస్తూ వచ్చారు. అక్కడే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2023లో రిటైర్ అయ్యాక తిరిగి చెన్నైకి వచ్చారు. అంతకు ముందు నుంచి లక్కీడ్రాలపై ఆసక్తి ఉన్న శ్రీరామ్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా వదల్లేదు. తన అదృష్టాన్ని నిత్యం పరీక్షించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. “కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్నాను. అదే సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ నా లక్ బాగుండి, ఆ సమయంలో నా దగ్గర టికెట్ లేకపోతే ఎలా.? అనే ప్రశ్న నాలో మొదలైంది. దీంతో మళ్లీ టికెట్ కొనుగోలు చేయాలనిపించింది” అని తెలిపారు.
అయితే తనకు నిత్యం గెలవాలన్న ఆశ ఉండేదని కానీ, అంత మందిలో గెలుస్తానన్న నమ్మకం లేదని తెలిపిన శ్రీరామ్.. కానీ ఎట్టకేలకు అదృష్టం తనవైపు వచ్చిందని తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఎమిరేట్స్ చరిత్రలో ఇది అతిపెద్ద విజయం:
ఈ విషయమై ఎమిరేట్స్ డ్రా సీఈఓ పాల్ సెబెస్టియన్ మాట్లాడుతూ.. “రూ. 231 కోట్లు గెలిచిన విజేతకి శుభాకాంక్షలు. ఇది మా గేమ్ చరిత్రలో అతిపెద్ద వ్యక్తిగత విజయం. ఇది ప్రపంచవ్యాప్తంగా కలలు నెరవేర్చే అవకాశం ఉందని నిరూపిస్తుంది.” అని చెప్పుకొచ్చారు.
ఆనందం, భయం రెండూ ఉన్నాయి:
ఈ విజయంతో తనకు ఆనందం, భయం రెండూ కలుగుతున్నాయని తెలిపారు శ్రీరామ్. జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చూడడం ఇదే తొలిసారని అని చెప్పుకొచ్చారు. కానీ ఎమిరేట్స్ డ్రా తన కలను నిజం చేసిందని, తన జీవితాన్ని మార్చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ విజయం కేవలం తన ఒక్క విజయం మాత్రమే కాదని, తనా పిల్లల భవిష్యత్తుకి ఆశ అని చెప్పుకొచ్చారు. ప్రతీ తండ్రి తన బిడ్డలను గొప్ప స్థానానికి తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తాడని, ఈరోజు తనకు ఆ అవకాశం ఎమిరేట్స్ ద్వారా వచ్చిందని చెప్పుకొచ్చారు.
గెలిచిన డబ్బుతో ఏం చేస్తాన్నంటే:
ఇంత పెద్ద మొత్తంలో గెలుచుకున్నారు కదా, మీరు ఏం చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ.. "నేను ఇది వరకే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఎంతమంది జీవితాల్ని, ముఖ్యంగా చిన్నారుల్ని ప్రభావితం చేస్తుందో చూస్తున్నాను. అందుకే ఇప్పుడు నాకు మనసుకు హత్తుకునే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అనుకుంటున్నాను. వృద్ధాశ్రమాలు కావచ్చు, క్యాన్సర్ బాధితులకు సహాయం కావచ్చు చేయాల్సిన మంచి చాలా ఉంది.” అని తెలిపారు.
గెలిచే స్ట్రాటజీ ఏమిటి?
“చాలామంది స్ట్రాటజీల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ అదృష్టానికి ఎలాంటి ఫార్ములాలు పనిచేయవు. నిజంగా చెప్పాలంటే, నా స్ట్రాటజీ ఒక్కటే – బాధ్యతగా ఆడాలి, మనం ఆఫోర్డ్ చేయగలిగిన టికెట్ కొనాలి, ఆనందంగా ఆడాలి. ఇదే అసలైన మజా!” అని తెలిపారు.
ఈ గెలుపు నిజమేనా? అనుకునేవారికి శ్రీరాం ఏమంటారు?
“ఇంటర్నెట్లో రకరకాల వాదనలు వినిపిస్తాయి. దీనిని ఫేక్ అనే వాళ్లుంటారు. వాళ్లను నమ్మొద్దు. నిజంగా తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు స్వయంగా ప్రయత్నించండి అని“ తేల్చి చెప్పారు.
231 కోట్ల రూపాయల గెలుపు శ్రీరాం జీవితాన్ని ఎలా మార్చింది?
“ఒకప్పుడు ఉద్యోగిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎక్కువయ్యాయి. ఇది నా జీవనశైలిని మారుస్తుందేమో కానీ, నన్ను మాత్రం మార్చదు.” అని చెప్పుకొచ్చారు.
మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు.?
ఈ ప్రశ్నకు శ్రీరామ్ బదులిస్తూ.. “నేను ఏం కొత్తగా ఆవిష్కరించలేదు, ఏ గ్రహం కనుగొనలేదు… అదృష్టం నన్ను వరించింది అంతే. కానీ నేను అందుకున్న అదృష్టాన్ని కొంత మందికైనా తిరిగి ఇవ్వడమే నిజమైన గెలుపుగా భావిస్తున్నాను. నేను ఇచ్చే మంచి వల్ల గుర్తుండిపోవాలనుకుంటున్నాను.” అని చెప్పుకొచ్చారు.
జీవితం మారాలని కలలు కంటున్న వేలాది మందికి ఆయన చెప్పిన మాటలు మాత్రం బంగారమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. “అపజయాలు ఎదురవుతాయి, కష్టాలు వస్తాయి, మీపై మీకే నమ్మకం తగ్గే క్షణాలు వస్తాయి… అయినా వెనక్కిత తగ్గొద్దు. కనీసం ఒక టికెట్ కొనండి, ఆనందించండి, బాధ్యతగా ఆడండి. ఎప్పుడు అదృష్టం మీవైపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను కూడా అదే చేశాను – అది నా జీవితాన్ని మార్చేసింది.” అని చివరిగా తెలిపారు శ్రీరామ్.