Saving scheme: రోజుకు రూ. 50 పొదుపు చేస్తే రూ. 35 లక్షలు పొందొచ్చు.. ఎలాగంటే
ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎంత పొదుపు చేశామన్నదే ముఖ్యమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటారు. చిన్న మొత్తంలో చేసే పొదుపు దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని అందిస్తాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తక్కువ మొత్తంలో పెట్టుబడి:
పెట్టుబడి అనగానే చాలా మంది ఖర్చులే అవుతున్నాయి ఇక సేవింగ్ చేసేది ఎలాగా అంటూ నిరుత్సాహపడుతుంటారు. అయితే చిన్న మొత్తంలో పొదుపు చేసుకున్నా పెద్ద మొత్తంలో రిటర్న్స్ పొందే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి ఒక బెస్ట్ పథకమే పోస్టాఫీస్ అందిస్తోన్న గ్రామ సురక్ష యోజన. ఈ పథకంలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకుంటూ పోయినా పెద్ద మొత్తంలో రిటర్న్స్ పొందొచ్చు. ఈ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు.
గ్రామ సురక్ష యోజన:
ఈ పథకం గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) కింద రన్ అవుతుంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుండటంతో ఇది పూర్తి భద్రత కలిగిన పెట్టుబడిగా పరిగణించవచ్చు. 19 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన భారతీయులు ఈ స్కీమ్లో చేరవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టొచ్చు.?
మీరు ఈ పథకంలో ఏడాదికి కనీసం రూ. 10,000 నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రీమియం చెల్లింపులు నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక విధానాల్లో ఎంచుకోవచ్చు.
రోజుకు రూ. 50 పెట్టుబడి పెడితే:
ఉదాహరణకు మీరు 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ పథకంలో చేరారని అనుకుందాం. మీరు నెలకు రూ. 1515 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ. 50 జమ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీరు మెచ్యూరిటీ సమయానికి రూ. 35 లక్షలు పొందొచ్చు.
బోనస్ కూడా లభిస్తుంది:
కేవలం మీ పెట్టుబడే కాకుండా, ప్రభుత్వం బోనస్ కూడా చెల్లిస్తుంది. దీని వల్ల మొత్త లాభం ఇంకా పెరుగుతుంది. మార్కెట్పై ఆధారపడే స్కీమ్లతో పోల్చితే ఇది స్థిరమైన ఆదాయం ఇస్తుంది.
ఇది పొదుపు మాత్రమే కాదు, జీవిత బీమా లాంటి భద్రతను కూడా అందిస్తుంది. మెచ్యూరిటీకి ముందు దురదృష్టవశాత్తు వ్యక్తి మరణిస్తే, నామినీకి పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. కుటుంబానికి ఇది గొప్ప భరోసాగా ఉంటుంది. మీరు నెలకు చెల్లించే ప్రీమియం ఎక్కువైతే, రాబడి కూడా పెరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి.?
మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్లి వివరాలు పొందవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు:
ఆధార్/ఐడీ ప్రూఫ్
అడ్రస్ ప్రూఫ్
పాస్పోర్ట్ సైజ్ ఫోటో