MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • Railways: ఛీ.. ట్రైన్‍లో ఇదేం పాడు పని...దుప్పట్లు కూడా సరిపోవట్లేదుగా

Railways: ఛీ.. ట్రైన్‍లో ఇదేం పాడు పని...దుప్పట్లు కూడా సరిపోవట్లేదుగా

Railways: ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారంటే ఇదేనేమో. కొంతమంది ఇలానే ఉంటారు. ఆఖరికి రైల్వే ఏసీ కోచ్ లో ఇచ్చే దుప్పట్లు, టవల్స్ తస్కరిస్తున్నారు. 4 ఏళ్లలో కోటీకిపైగా బెడ్‍రోల్ వస్తువులు ఎత్తుకెళ్లిపోయారు. రైల్వేకు ఎంత నష్టమొచ్చిందో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
| Updated : Jul 13 2026, 09:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గుడిని వదలరు, గుడిలో లింగాన్ని వదలరు
Image Credit : chatgpt

గుడిని వదలరు, గుడిలో లింగాన్ని వదలరు

గుడిని వదలరు, గుడిలో లింగాన్ని వదలరు. ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారు. చేయి చూపిస్తే మండ మింగేస్తారు. ఈ సామెతలన్నీ కరెక్టుగా సరిపోతాయి. కొంతమంది ఏసీ రైలులో ప్రయాణిస్తూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సెల్ ఫోన్లు, డబ్బులు, ఇళ్లల్లో చోరీ చేసే వాళ్లని చూసే ఉంటాం. కానీ మీరాంట్రే ఇలా ఉన్నారు. ఇంతకీ ఏమైందో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.27కోట్ల బెడ్ రోల్ వస్తువులు మాయం
Image Credit : chatgpt

1.27కోట్ల బెడ్ రోల్ వస్తువులు మాయం

రైలులో ప్రయాణం పూర్తయ్యాక తమ సామాన్లతో దిగాల్సిన ప్రయాణికులు..కొందరు రైల్వే ఆస్తినే తమ లగేజీలో వేసుకుని ఎత్తుకెళ్లిపోతున్నారు. ఏసీ కోచ్ లో ప్రయాణికులకు ఉచితంగా ఇచ్చే దుప్పట్లు, బెడ్ షీట్లు, ఫేస్ టవల్స్ను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. ఈ కక్కుర్తి కారణంగా గత నాలుగేళ్లలో భారతీయ రైల్వేకు చెందిన 1.27కోట్ల బెడ్ రోల్ వస్తువులు మాయమయ్యాయి. ఇందులో ఎక్కువగా టవల్స్, దుప్పట్లు, బ్లాంకెట్లు చోరీకి గురయ్యాయి. 2022 జనవరి నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా 54 రైల్వే డివిజన్లలో చోరీ జరిగింది. దీనివల్ల గత నాలుగేళ్లలో ఇండియన్ రైల్వేస్‍కు రూ.104 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

Related Articles

Related image1
Petrol Tank: వర్షాకాలంలో కారు ట్యాంక్ ఖాళీగా ఉంచుతున్నారా? అసలు ఎంత పెట్రోల్ ఉండాలి?
Related image2
Western Toilet: వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి
34
రైల్వేకు రూ.104 కోట్లకు పైగా నష్టం
Image Credit : Asianet News

రైల్వేకు రూ.104 కోట్లకు పైగా నష్టం

సాధారణంగా ఏసీ కోచ్ లో ప్రయాణించే వారికి దుప్పటి, బెడ్ షీట్, దిండు కవర్, ఫేస్ టవల్...ఇలా ఒక బెడ్ రోల్ కిట్ ఇస్తారు. ప్రయాణం కంప్లీట్ అయ్యాక మళ్లీ వాటిని అక్కడే వదిలేయాలి. ఇండియన్ రైల్వేస్ లో వర్క్ చేసే వాళ్లు వాటిని తీసుకెళ్లి ఉతికి శుభ్రం చేశాక..తర్వాత ప్రయాణికులకు ఇస్తారు. కానీ కొందరు వాటిని తమతో తీసుకెళ్తుండటంతో రైల్వే శాఖకు భారీ నష్టం వాటిల్లుతోంది.

44
56 శాతం పెరిగిన దొంగతనం
Image Credit : AI

56 శాతం పెరిగిన దొంగతనం

అధికారుల లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది ప్రయాణికుల్లో ఒకరు కనీసం ఒక బెడ్ రోల్ వస్తువైనా ఎత్తుకెళ్తున్నారు. 2022లో పోలిస్తే 2025 నాటికి ఈ దొంగతనాలు 56 శాతం పెరిగాయట. దీంతో కొత్త బెడ్ రోల్స్ సరఫరా చేసే కాంట్రక్టర్లపై అదనపు భారం పడుతోందట. కొన్నిసార్లు ఇతర ప్రయాణికులకు సరిపడా బెడ్ రోల్స్ అందించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ చోరీలు ఎక్కువగా రాజస్థాన్ లోని బికనేర్ డివిజన్లో జరుగుతున్నట్లు గుర్తించారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Recommended image2
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం
Recommended image3
ఇంగ్లిష్‌ను నాన్ నేటివ్ భాషగా ఎలా పరిగణిస్తారు? CBSE భాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
Related Stories
Recommended image1
Petrol Tank: వర్షాకాలంలో కారు ట్యాంక్ ఖాళీగా ఉంచుతున్నారా? అసలు ఎంత పెట్రోల్ ఉండాలి?
Recommended image2
Western Toilet: వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved