Asianet News TeluguAsianet News Telugu

నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది.. సీబీఐపై మనీష్ సిసోడియా ఆగ్రహం

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం నాడు తన కార్యాలయంపై సీబీఐ దాడిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం సీబీఐ కసరత్తు దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు.

CBI refutes Delhi deputy CM Manish Sisodia claim of raid at his residence
Author
First Published Jan 15, 2023, 11:58 PM IST

ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి 'కేజ్రీవాల్ వర్సెస్ సీబీఐ' గేమ్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం నాడు తన కార్యాలయంపై సిబిఐ దాడిపై అధికారిక ప్రకటన చేశారు. సీబీఐ దాడులను దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. రెండవ శనివారం (అధికారిక సెలవుదినం) నాడు సిబిఐ అధికారులు తన కార్యాలయంపై దాడి చేసి, తన కార్యాలయం నుంచి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకోవాలని కార్యదర్శికి  రాత పూర్వక నోటీసు ఇచ్చిందని, ఈ దాడులను దురుద్దేశంతో కూడిన చర్య అని డిప్యూటీ సిఎం తన ప్రకటనలో పేర్కొన్నారు.

హాష్ వాల్యూ ఇవ్వకుండా కంప్యూటర్‌ను సీజ్ చేసి, నన్ను దురుద్దేశపూర్వకంగా ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.  సిసోడియా చేసిన ఈ ప్రకటనతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. నోటీసు ప్రకారం.. తన కాన్ఫరెన్స్ రూమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన సిస్టమ్ యొక్క CPUని ఇవ్వాల్సిందిగా సెక్రటరీని అభ్యర్థించారని అన్నారు. 

తర్వాత.. నిర్దేశించబడిన విధివిధానాలను పాటించకుండా తన  కార్యాలయంలోని కాన్ఫిరేన్స్ రూం  నుండి CPUని స్వాధీనం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన  నోటీసును పరిశీలించినప్పుడు.. అవి చేతితో వ్రాయబడి ఉన్నాయని అన్నారు. సీబీఐ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. సిబిఐ అధికారుల ప్రవర్తన చూస్తే.. వారి దురుద్దేశం చాలా సులభంగా తెలుసుకోవచ్చని అన్నారు. 'హాష్ వాల్యూ' ఇవ్వకుండానే సీబీఐ అధికారులు తన కంప్యూటర్‌ను సీజ్ చేశారని  సిసోడియా ఆరోపించారు.  

అధికారిక నియమవళి ప్రకారం.. "హాష్ వాల్యూ  తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ వేలిముద్ర. ఫైల్‌లోని డేటా క్రిప్టోగ్రాఫిక్ అల్గారిథమ్ ద్వారా హాష్ వాల్యూను పరిగణిస్తారు. ఇది డేటా వేరియబుల్స్ యొక్క స్ట్రింగ్. హాష్ విలువను నిర్ణయించడంలో కీలకం . సందేహాస్పద డేటా యొక్క సమగ్రతను ధృవీకరిస్తుంది. సీజ్ చేయబడిన ఎలక్ట్రానిక్ పరికరం/డిజిటల్ పరికరం యొక్క సమగ్రత కేసును స్థాపన చేయడానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి.. స్వాధీనం చేసుకున్న సమయంలో దర్యాప్తు అధికారి డేటా రికార్డ్ యొక్క హాష్ విలువను తీసుకున్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఎలక్ట్రానిక్ రికార్డులను ప్రామాణీకరించడానికి హ్యాషింగ్ యొక్క ఉపయోగం IT చట్టం, 2000లోని సెక్షన్ 3(2)లో వివరించబడింది. జప్తు సమయంలో "హాష్ విలువ" రికార్డింగ్ లేనప్పుడు, సిబిఐ తన సౌలభ్యం మేరకు సీజ్ చేసిన సిపియులోని రికార్డును మార్చుకోవచ్చని ఆయన అన్నారు.
 
సిసోడియా తన ప్రకటనలో.. సిబిఐ సిపియులో నిల్వ చేయబడిన రహస్య ఫైల్‌లు / పత్రాలను ధ్వంసం చేయడానికి, సిపియులో ఫైల్‌లను ఇంప్లాంట్ / ఎడిట్ చేస్తుందని,తన పేరు లేకున్న తనని తప్పుగా ఇరికించారని పేర్కొన్నారు. పైన పేర్కొన్న కేసుకు సంబంధించి సిబిఐ నిందితుడిగా ఛార్జిషీట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గత ఆగస్టు 2022 నుండి ఎక్సైజ్ వ్యవహారంలో సిబిఐ/ఇడి దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, తనపై సంభించిన  ఎలాంటి ఆధారాలు కనుగొనలేకపోయిందనీ..అయినప్పటికీ, సిబిఐ ఈ విషయంపై విచారణను కొనసాగిస్తోందని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios