Asianet News TeluguAsianet News Telugu

కాలేజీ స్టూడెంట్ పై ఆటో డ్రైవర్ అఘాయిత్యం.. చేతులు పట్టుకొని 500 మీటర్లు లాక్కెళ్లిన వైనం.. వీడియో వైరల్..

ఓ కాలేజీ విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆటో కదులుతుండగానే ఆమెను చేతులు పట్టుకొని లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Auto driver assaulted college student..Vainam held hands and locked himself for 500 meters..Video went viral..
Author
First Published Oct 15, 2022, 11:17 AM IST

మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం ఉదయం ఓ ఆటో రిక్షా డ్రైవర్ కాలేజీ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడు. బాలికను బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇదే సమయంలో అతడి నుంచి విడిపించుకోవడానికి బాలిక తీవ్రంగా కష్టడింది. దీంతో ఆమెను దుండగుడు చేతులు పట్టుకుని ఆటోలో సుమారు 500 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మాకు ముగ్గురు భార్యలున్నా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం.. కానీ హిందువులు.. : ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ ఘటన శుక్రవారం ఉదయం 6.45 గంటలకు జరిగింది. బాధితురాలు కాలేజీ విద్యార్థిని. ఆమె కాలేజీకి వెళ్తుండగా నిందితులు ఆమె చేయి పట్టుకుని వేధించారు. సీనియర్ ఇన్స్పెక్టర్ కు జైరాజ్ రాణావేర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కాలేజీ విద్యార్థిని పట్ల ఆ ఆటో డ్రైవర్ అసభ్యంగా కామెంట్స్ చేశాడు. దీంతో బాలిక ఎదురు తిరిగింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపం తెచ్చుకున్న ఆటో డ్రైవర్ ఆమెను ఆటోలోకి లాగేందుకు ప్రయత్నించాడు. అనంతరం ఆటోను స్టార్ చేశాడు.

ఆమె రోడ్డుపై ఉండగానే ఆటోను ముందుకు కదిలించాడు. ఆమెను అలాగే దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లారు. కొంత సమయం తరువాత ఆమె కిందపడిపోయింది. దీంతో అక్కడి నుంచి పారారయ్యాడు. ఈ ఘటన ఆటో డ్రైవర్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నా డని, అతడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. త్వరలో నిందితులు పోలీసుల కస్టడీకి రానున్నారు.

ఇంకెప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోబోము - బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్..

ఇదిలా ఉండగా.. ఢిల్లీలోనూ విద్యార్థిని పై అత్యాచారం చేసి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. ఇంతకు ముందు దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సెప్టెంబర్ 30న జరిగింది. బాలిక మధ్యాహ్నం 1.43 గంటల ప్రాంతంలో సాకేత్లోని తన పాఠశాల నుండి బయలుదేరింది. ఇక్కడి నుంచి ఢిల్లీలోని లజ్పత్ నగర్లో ఉన్న తన తల్లిని కలిసేందుకు ఆటోలో బయలుదేరాడు. మార్గ మధ్యంలో, డ్రైవర్ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఆమెను అనుచితంగా తాకాడు.

క‌ర్నాట‌క‌లో లంపీ స్కిన్ డిసీజ్ తో 2 వేల ప‌శువులు మృతి.. టీకాలు వేయించాలంటూ సూచ‌న‌లు

భయపడిన విద్యార్థి ఎలాగోలా లజ్పత్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆటో దిగిపోయింది. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసులో పోలీసులు అదే రోజు సాకేత్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 354, 509, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios