Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై ఆగ్రహం.. ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పు.. వీడియో వైరల్

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడి ఇంటిని పలువురు తగులబెట్టారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు.

Anger over the naked procession of Manipur women.. The house of the main accused was set on fire.. The video went viral..ISR
Author
First Published Jul 21, 2023, 12:25 PM IST

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశం మొత్తం ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న హుయిరెమ్ హెరోదాస్ మీటీ ఇంటిని దుండగులు గురువారం తగులబెట్టారని ‘ఇండియా టుడే’ నివేదించింది. ఈ గుంపులో కొందరు వ్యక్తులు, ముఖ్యంగా అత్యధికంగా మహిళలు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లోక్ సభపై సీఎం కేసీఆర్ నజర్.. మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి ఎంపీగా పోటీ ?

మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలోని ఓ వర్గానికి చెందిన మహిళలను మరో వర్గం గుంపు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం వెలుగుచూసింది. అది వెంటనే వైరల్ గా మారింది. ఈశాన్య రాష్ట్రంలో మే 3న జాతి హింస చెలరేగిన మరుసటి రోజే కాంగ్పోక్పి జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అక్కడ ఇంటర్నెట్ నిషేధం ఉండటంతో అది బయటకు రాలేదు. కానీ ఇంటర్నెట్ నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయడంతో ఈ భయానక దృశ్యాలు బయటకు వచ్చి వైరల్ గా మారాయి.

ఈ వీడియోను గమనించిన మణిపూర్ పోలీసులు బుధవారం రాత్రి తౌబాల్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, వీలైతే మరణశిక్షను కోరుతామని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ గురువారం చెప్పారు.

మెనూ ప్రకారం భోజనం తయారు చేయడం లేదని ఫిర్యాదు.. ప్రిన్సిపాల్, సూడెంట్లకు మధ్య ఘర్షణ.. వీడియో వైరల్

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మీతీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా మే 3 న కొండ జిల్లాల్లో ‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’ నిర్వహించినప్పుడు మణిపూర్ లో జాతి హింస చెలరేగినప్పటి నుండి 150 మందికి పైగా మరణించారు. అలాగే అనేక మంది గాయపడ్డారు.

సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సినీ నటికి ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్ ఆఫర్.. హోటల్ కు వెళ్లగానే అత్యాచారం..

మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మెయిటీలు నివసిస్తున్నారు. వీరంతా ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు, నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరంతా ఎక్కువగా కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios