Asianet News TeluguAsianet News Telugu

పని ఇప్పిస్తానని .. వేశ్యా గృహానికి అమ్మకం: గర్భవతిగా ఇంటికొచ్చిన బాలిక

కామాంధుల చేతుల్లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 13 నెలల పాటు నరకం అనుభవించిన బాలిక ఎట్టకేలకు ఇంటికి చేరింది. అయితే కూతురు ఇంటికి వచ్చిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో సేపు నిలవలేదు

After 13 Months Minor Girl Escapes 4 Men in UP Who Kidnapped ksp
Author
Uttar Pradesh, First Published Jan 15, 2021, 5:49 PM IST

కామాంధుల చేతుల్లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 13 నెలల పాటు నరకం అనుభవించిన బాలిక ఎట్టకేలకు ఇంటికి చేరింది. అయితే కూతురు ఇంటికి వచ్చిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో సేపు నిలవలేదు.

ఉత్తరప్రదేశ్‌లోని మహానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన ఉప్రేత కుమార్‌ స్థానికంగా ఓ స్కూల్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు.

వారి ఆర్ధిక పరిస్ధితిని ఆసరగా తీసుకుని పని ఇప్పిస్తానని చెప్పి ఏడాది క్రితం ఆమెను తనతో తీసుకువెళ్లాడు. నాటి నుంచి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి తన కోరిక తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను ఇతర వ్యక్తులకు అమ్మేశాడు.

అనంతరం వారు బాధితురాలిని వ్యభిచార గృహానికి తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా ఉపవాసం ఉంచారు. ఆ దుర్మార్గుల వేధింపులు తట్టుకోలేక, ఎట్టకేలకు వారి బారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక ఇంటికి చేరుకుంది.

దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఉప్రేత కుమార్‌ , జితూ కశ్యప్‌, వరుణ్‌ తివారి, అజయ్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదే సమయంలో బాలిక అనారోగ్యం పాలుకావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు . పరీక్షించిన వైద్యులు ఆమె ఐదు నెలల గర్భవతిగా తేల్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios