ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. తాజాగా.. ట్రైన్ టికెట్ బుకింగ్, క్యాన్సిల్, ట్రాకింగ్ వంటి సేవల్ని సులభతరం చేసేందుకు ఆస్క్ దిశ 2.0 అనే AI ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారతీయ రైల్వే.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్, క్యాన్సిల్, ట్రాకింగ్ వంటి సేవలను మరింత సులభతరం చేసేందుకు Ask DISHA 2.0 ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.
వాయిస్ కమాండ్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు
ప్రయాణికులు IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను ఓపెన్ చేసిన వెంటనే ఈ కొత్త చాట్బాట్ను ఉపయోగించవచ్చు. వాయిస్ కమాండ్ల ద్వారా సమాచారాన్ని అందించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తోంది.
AI టెక్నాలజీ
ఇప్పటివరకు టికెట్ బుకింగ్ చేయడానికి పాస్వర్డ్ అవసరం అయ్యేది. ఇప్పుడు OTP ద్వారా లాగిన్ అవ్వచ్చు. టికెట్ క్యాన్సిలేషన్, లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా.. త్వరగా రిఫండ్ పొందడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వర్చువల్ అసిస్టెంట్.. భవిష్యత్తులో టికెట్ బుకింగ్ను వేగవంతం చేయడానికి ప్రయాణీకుల వివరాలను కూడా సేవ్ చేస్తుంది.
AskDISHA 2.0
బ్రౌజర్లో 'AskDISHA 2.0' అని టైప్ చేస్తే.. సంబంధిత వెబ్పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ టికెట్ బుకింగ్ కోసం స్క్రీన్ కనిపిస్తుంది. కింద వాయిస్ కమాండ్ కోసం మైక్ ఐకాన్ ఉంటుంది. టికెట్ బుకింగ్ మాత్రమే కాదు.. PNR స్టేటస్, బుకింగ్ హిస్టరీ, టికెట్ రద్దు వంటి అనేక సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ఎలా పని చేస్తుందంటే?
ఉదాహరణకు మీరు రీఫండ్ స్టేటస్ చెక్ చేయాలి అనుకుంటే ఆ బటన్ ని క్లిక్ చేయగానే.. మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అవి టికెట్ క్యాన్సిల్, ఫేయిల్డ్ ట్రాన్సక్షన్, టికెట్ డిపాజిట్ రిసిప్ట్. వీటిలో మీకు అవసరమైన దాన్ని ఎంచుకొని PNR నంబర్ను నమోదు చేస్తే, వెంటనే స్క్రీన్పై రీఫండ్ స్టేటస్ కనిపిస్తుంది.
మెరుగైన సేవలు
'AskDISHA 2.0' యాప్ ద్వారా ప్రయాణికులు రైల్వే సేవలను వేగంగా, సులభంగా పొందవచ్చు. టెక్నాలజీ ఆధారంగా IRCTC అందించే ఈ చాట్బాట్, రైల్వే యూజర్లకు అద్భుతమైన పరిష్కారంగా మారుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.