భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో పాక్ ప్రేరిత ఉగ్రవాద స్థావరాలపై లక్ష్య దాడుల నేపథ్యంలో.. కొలంబియా ప్రభుత్వం పాకిస్తాన్లో ప్రాణనష్టంపై సంతాపం తెలిపింది.
అయితే ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు మరణించిన విషయంపై మాత్రం కొలంబియా మౌనంగా ఉండడాన్ని భారత్ గమనిస్తూనే ఉంది. ఇదే విషయమై భారత పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ మాట్లాడుతూ.. "ఉగ్రవాద బాధితులపై సానుభూతి చూపకుండా, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాకిస్తాన్పై సంతాపం తెలిపింది" అన్నారు. "ఉగ్రవాదులను పంపే వాళ్లకు, ఆ దాడులను తిప్పికొట్టే వాళ్లకు సమానత్వం ఉండదు. ఈ విషయంలో తప్పుదొర్లినా, మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం," అని చెప్పారు.
పహల్గాం దాడి వెనుక పాక్ ఉగ్ర ముఠా
ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత స్వీకరించింది. ఇది పాక్లోని లష్కరే తోయిబా కు చెందిన ఉపముఠా. TRF ఇప్పటికే రెండు సార్లు ఈ దాడికి బాధ్యత తీసుకోవడంతో, దీనివెనుక పాకిస్తాన్ ప్రమేయం స్పష్టమైంది.
కొలంబియా పాక్ వైపు ఎందుకు?
ఒకప్పుడు అమెరికాకు అత్యంత దగ్గర మిత్ర దేశంగా ఉన్న కొలంబియా, ఇటీవల చైనా వైపు చూస్తోంది. 2024లో చైనా-కొలంబియా మధ్య వ్యాపార విలువ $21 బిలియన్లను దాటి పోయింది. ఇటీవల బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) లో కొలంబియా చేరింది. చైనా, రెండు డజన్ల J-10CE ఫైటర్ జెట్లను కొలంబియాకు విక్రయించాలని ప్రతిపాదించింది
రిటైర్డ్ మేజర్ జనరల్ సుధాకర్ మాట్లాడుతూ.. "గొడవలో మిత్రుడి మిత్రుడే మిత్రుడవుతాడు," చైనా-పాకిస్తాన్-కొలంబియా మధ్య ఏర్పడుతున్న చక్రవ్యూహమే దీనికి కారణమవుతుందన్నారు. పాక్ గూఢచారి సంస్థ ISI కు కొలంబియన్ డ్రగ్ కార్టెళ్లతో సంబంధాలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
పాక్ ఇంజినీర్లు, టెక్నీషియన్లు కొలంబియాలోకి అక్రమంగా ప్రవేశించి, నార్కో సబ్మెరిన్లు (డ్రగ్ సబ్బరిన్లు) తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సబ్మెరిన్లు ఉగ్రవాద, మాదకద్రవ్య సంబంధిత కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రూపొందించారు.
కొందరు పాక్ ఇంజినీర్లు కార్టెల్లలో లీడర్ స్థాయికి చేరినట్టు సమాచారం. ఈ గంభీరమైన మిలటరీ, డ్రగ్, టెక్నికల్ సంబంధాల వల్ల కొలంబియా పాక్కు మద్దతు ఇచ్చిందా అన్న అనుమానం బలపడుతోంది. శశి థరూర్ చివరగా మాట్లాడుతూ.. "భారత్ లాగే కొలంబియాకు కూడా గతంలో తీవ్ర ఉగ్రదాడుల బాధను ఎదుర్కోవాల్సి వచ్చింది. అటువంటి దేశం పాక్కు మద్దతు తెలపడం బాధాకరం. అన్నారు. "పాక్లో ఉగ్రవాదాన్ని పెంపొందించే మౌలిక సదుపాయాలు ఇప్పటికీ ఉన్నాయని సాక్ష్యాలతోనే నిరూపితమవుతోంది," అని అన్నారు.
కొలంబియా ఇచ్చిన ఈ సందేశానికి భారత్ కూడా స్పష్టంగా స్పందించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కొలంబియా ఈ పరిస్థితుల నేపథ్యంలో తన వైఖరిని మార్చుకుంటుందా? లేక ఉగ్రవాదాన్ని పెంపొందించే దేశం పక్కనే నిలబడతుందా? అన్నది వేది చూడాలి.