MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Train: గంటలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. పట్టాలపై కాదు గాల్లో వెళ్లే రైలు గురించి తెలుసా?

Train: గంటలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. పట్టాలపై కాదు గాల్లో వెళ్లే రైలు గురించి తెలుసా?

మనకు తెలిసినంత వరకు రైలు ఎంత వేగంతో వెళ్తుంది. ఏముంది గంటకు వంద లేదా అంతకంటే కాస్త ఎక్కువ అంటారా.? వందే భారత్ అయితే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. అయితే గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు ఉందని మీకు తెలుసా.?

1 Min read
Narender Vaitla
Published : May 30 2025, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గాలిలో ప్రయాణించే రైలు!
Image Credit : Google

గాలిలో ప్రయాణించే రైలు!

ప్రపంచంలో సాధారణంగా రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయి. ఇవి గంటల వ్యవధిలో వందల కిలోమీటర్ల దూరాన్ని పయనించగలవు. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లు మాత్రం భూమిని తాకకుండా గాలిలో ప్రయాణిస్తాయి. ఇది నిజంగా వినడానికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ కొన్ని దేశాల్లో మాగ్లెవ్ టెక్నాలజీతో ఇది సాకారమవుతోంది.

25
మాగ్లెవ్ రైలు టెక్నాలజీ అంటే ఏమిటి?
Image Credit : Getty

మాగ్లెవ్ రైలు టెక్నాలజీ అంటే ఏమిటి?

జపాన్‌లో మాగ్లెవ్ అనే అధునాతన రైలు వ్యవస్థ అమలులో ఉంది. ఈ రైలు “Magnetic Levitation” టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో రైలు చక్రాలు ట్రాక్‌ను తాక‌వు. అయస్కాంత శక్తి ద్వారా గాల్లో తేలుతూ ప్రయాణిస్తుంది. దీంతో ఈ రైలు అత్యంత వేగంగా దూసుకెళ్తుంది.

Related Articles

Related image1
China: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ అమ్మాయిలపై చైనా యువ‌త చూపు.. ఎందుకో తెలుసా.?
Related image2
Goa: గోవా వెళ్లే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఆ మాఫియాకు చెక్ పెట్టేలా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు
35
ప్రపంచంలోనే వేగ‌మైన రైలు
Image Credit : Getty

ప్రపంచంలోనే వేగ‌మైన రైలు

జపాన్ అభివృద్ధి చేసిన SCmaglev రైలు గంటకు 600 కి.మీ. వరకు దూసుకుపోతుంది. ఇది భూమికి కొద్దిగా పైకి లెవిటేట్ అయి ప్రయాణిస్తుంది. సాధారణంగా ఈ రైలు ట్రాక్‌పై ఒక అంగుళం నుంచి ఆరు అంగుళాల మధ్య ఎత్తులో తేలి ఉంటుంది. వేగంగా ప్రయాణించడమే కాకుండా, శబ్దం తక్కువగా ఉంటుంది.

45
చైనాలో కూడా
Image Credit : Google

చైనాలో కూడా

జపాన్‌తో పాటు చైనా కూడా మాగ్లెవ్ రైళ్లను విజయవంతంగా నడుపుతోంది. అక్కడి రైళ్లు కూడా గంటకు 430 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. ఉదాహరణకి, ఢిల్లీ నుండి చండీగఢ్ వరకు ఉన్న దూరాన్ని అర్ధ గంటలో పూర్తిచేయగల శక్తి మాగ్లెవ్ రైళ్లకు ఉంది.

55
భారత్‌లో మాగ్లెవ్ రైలు
Image Credit : @IndianTechGuide

భారత్‌లో మాగ్లెవ్ రైలు

భారతదేశంలో కూడా మాగ్లెవ్ టెక్నాలజీపై పరిశీలనలు జరుగుతున్నాయి. జపాన్ సహకారంతో ఈ సాంకేతికతను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రవాణా ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు, వేగం, సౌకర్యం విషయంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఒక‌వేళ భార‌త్‌లో ఈ రైళ్లు అందుబాటులోకి వ‌స్తే హైద‌రాబాద్ నుంచి తిరుప‌తికి కేవ‌లం గంట‌లో దూసుకెళ్లొచ్చ‌న్న‌మాట‌.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
హైదరాబాద్
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved