ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణకు తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. వాణిజ్య చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించి సంధి చేశానని ఆయన అన్నారు.

ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణకు తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం మళ్ళీ చెప్పారు. వాణిజ్య చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించి సంధి చేశానని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న సత్సంబంధాలను ట్రంప్ ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఎదురైన సవాళ్ల గురించి కూడా ప్రస్తావించారు. 

"పాకిస్తాన్, ఇండియా విషయంలో మనం ఏం చేశామో చూడండి, ఆ మొత్తం విషయాన్ని నేను సెటిల్ చేశాను, వాణిజ్యం ద్వారా సెటిల్ చేశానని నేను అనుకుంటున్నాను. మేము ఇండియాతో పెద్ద ఒప్పందం చేసుకుంటున్నాము. పాకిస్తాన్‌తో కూడా పెద్ద ఒప్పందం చేసుకుంటున్నాము... ఎవరో ఒకరు చివరిగా కాల్పులు ఆపాలి, కానీ కాల్పులు మరింత తీవ్రమయ్యాయి. అలాంటి సమయంలో మేము వారితో మాట్లాడాము. సమస్యను పరిష్కరించాము. ఆపై రెండు రోజుల తర్వాత ఏదో జరిగింది, అది ట్రంప్ తప్పు అని వారు అన్నారు, కానీ పాకిస్తాన్‌లో కొంతమంది మంచి వ్యక్తులు, మంచి నాయకులు ఉన్నారు, ఇండియాలో నా స్నేహితుడు... మోదీ, ఆయన గొప్ప వ్యక్తి" అని వైట్ హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో జరిగిన సమావేశంలో ట్రంప్ అన్నారు.

 

Scroll to load tweet…

 

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించినందుకు ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.

ఈ ఆపరేషన్ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది, దీంతో తీవ్రమైన ఘర్షణలు జరిగాయి, అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారత నగరాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. LoC వెంబడి కాల్పులు జరిగాయి. 

ఇదిలా ఉంటే భారత్, పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అందరికంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. భారత్, పాక్ ల మధ్య అమెరికాల కీలక పాత్ర పోషించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. 

"యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వం వహించిన చర్చల తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నాకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో మీ శ్రద్ధకు ధన్యవాదాలు!" అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే. 

అయితే భారత్, పాక్ లమధ్య నెలకొన్న సమస్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు చేసిన వాదనలను భారతదేశం ఖండించింది. 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభం నుంచి కాల్పుల విరమణ వరకు భారత, అమెరికా నాయకుల మధ్య జరిగిన చర్చల్లో "వాణిజ్యం" అనే అంశం చర్చకు రాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.