- Home
- Telangana
- జూన్ 2 తెలంగాణ ప్రజలకు చాలా కీలకం.. ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు మరెన్నో
జూన్ 2 తెలంగాణ ప్రజలకు చాలా కీలకం.. ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు మరెన్నో
Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. జూన్ 2న పలు కొత్త పథకాలు ప్రారంభించడంతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న స్కీమ్స్ను మరింత విస్తరించే ప్రణాళికను రూపొందించింది.

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకానికి శ్రీకారం
రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా’ పథకాన్ని ప్రారంభించబోతోంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ స్కీమ్ కింద ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల వరకు జీవిత భీమా రక్షణ కల్పించనున్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో భారీ నిధులు కేటాయించింది. ఈ స్కీమ్ అమలు కోసం ఎల్ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే విధివిధానాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ పథకం పెద్ద ఊరటనివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.

రెండు లక్షల కొత్త పెన్షన్లు.. చేయూత విస్తరణ
ప్రస్తుతం అమలులో ఉన్న చేయూత పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా సుమారు రెండు లక్షల మంది అర్హులకు వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పెన్షనర్లకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. పెన్షన్ మొత్తాన్ని పెంచే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలన జరుపుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో వేలాది కుటుంబాలు ఈ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రత్యేక దృష్టి
సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో దశను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. సొంత స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. జూన్ 2 నుంచి ఇందుకు సంబంధించిన నిధుల విడుదల ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ప్రజల ఉపాధికి దూరంగా కాకుండా, ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్ల కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటికే నిర్మాణం పూర్తై, మౌలిక సదుపాయాల లేమితో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి సదుపాయాలు కల్పించి అర్హులకు అప్పగించనున్నారు.
ఉద్యోగులకు క్యాష్లెస్ వైద్యం.. డిజిటల్ హెల్త్ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకురానుంది. దాదాపు 23 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిగా క్యాష్లెస్ చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కింద వేల సంఖ్యలో వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్ట్ను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల డేటా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.విద్య, ఉపాధి రంగాల్లో కొత్త కార్యక్రమాలు
విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం కూడా ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక వసతులతో మోడల్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసే ప్రణాళికకు ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. డిజిటల్ క్లాస్రూమ్స్, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు, మెరుగైన బోధన విధానాలతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరించనున్నారు. భవిష్యత్తులో అల్పాహారం అందించే అవకాశాలపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరోవైపు నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నారు. జర్మనీ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలకు అవసరమైన భాషా శిక్షణ, వీసా మార్గదర్శకాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇక వైద్య రంగంలో భాగంగా సనత్నగర్లోని టిమ్స్ ఆసుపత్రిలో పాక్షిక సేవలను కూడా జూన్ 2 నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలు శుభవార్తలు అందనున్నాయి.
విద్య, ఉపాధి రంగాల్లో కొత్త కార్యక్రమాలు
విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం కూడా ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక వసతులతో మోడల్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసే ప్రణాళికకు ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. డిజిటల్ క్లాస్రూమ్స్, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు, మెరుగైన బోధన విధానాలతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరించనున్నారు. భవిష్యత్తులో అల్పాహారం అందించే అవకాశాలపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరోవైపు నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నారు. జర్మనీ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలకు అవసరమైన భాషా శిక్షణ, వీసా మార్గదర్శకాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇక వైద్య రంగంలో భాగంగా సనత్నగర్లోని టిమ్స్ ఆసుపత్రిలో పాక్షిక సేవలను కూడా జూన్ 2 నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలు శుభవార్తలు అందనున్నాయి.

