- Home
- Telangana
- రెండు మెట్రో నగరాల మధ్య ఉన్న పట్టణం.. రానున్న రోజుల్లో ఇక్కడ రియల్ బూమ్ ఖాయం. ఇప్పుడే కొనేయండి
రెండు మెట్రో నగరాల మధ్య ఉన్న పట్టణం.. రానున్న రోజుల్లో ఇక్కడ రియల్ బూమ్ ఖాయం. ఇప్పుడే కొనేయండి
Real Estate: రియల్ ఎస్టేట్ విస్తృతి క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లోనూ పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ పెరగడానికి అవకాశాలున్న ఓ పట్టణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం

తెలంగాణలో వేగంగా ఎదుగుతున్న పట్టణంగా సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రస్తుతం తెలంగాణలో అత్యంత వేగంగా మార్పులు చెందుతున్న పట్టణాల్లో ముందంజలో ఉంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి మీద కీలకంగా ఉండటం ఈ పట్టణానికి పెద్ద బలం. రెండు ప్రధాన మెట్రో నగరాల మధ్య ఉండటం వల్ల రాకపోకలు సులభంగా ఉండటం, వ్యాపార అవకాశాలు పెరగటం ఇక్కడి అభివృద్ధికి దోహదపడుతోంది.
రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా మారిన సూర్యాపేట
ఒకప్పుడు కేవలం వ్యవసాయ లావాదేవీలకు పరిమితమైన సూర్యాపేట, ఇప్పుడు ఆధునిక నివాస ప్రాంతాలకు కేంద్రంగా మారింది. పట్టణ విస్తరణ వేగంగా జరుగుతుండటంతో కొత్త వెంచర్లు, లేఅవుట్లు వరుసగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ శివార్లలో నివాస ప్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగింది.
ప్లాట్ల ధరలు ఊహించని స్థాయికి
రియల్ ఎస్టేట్ మార్కెట్ గణాంకాలు చూస్తే సూర్యాపేటలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం చదరపు గజం రూ. 8,000 నుంచి రూ. 10,000 మధ్య ఉన్న ధరలు ఇప్పుడు రూ. 15,000 దాటేశాయి. జాతీయ రహదారి సమీపంలోని వెంచర్లలో చదరపు గజం ధరలు రూ. 20,000కు మించి పలుకుతున్నాయి. ఇది ఇక్కడ పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ను చూపిస్తోంది.
అభివృద్ధి ప్రాజెక్టులతో పెరుగుతోన్న భూముల విలువలు
సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్, మెడికల్ కాలేజీ ప్రారంభం, ఐటి హబ్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రణాళికలు సూర్యాపేట ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చుతున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరగడంతో జనాభా ప్రవాహం కూడా ఎక్కువవుతోంది. ఫలితంగా నివాస అవసరాలు పెరిగి భూముల ధరలు మరింత ఎగబాకుతున్నాయి.
రెండు పెద్ద నగరాల మధ్య
హైదరాబాద్లో భూముల ధరలు సామాన్యులకు అందని స్థాయికి చేరడంతో పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ ప్రాంతాల వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సూర్యాపేట సురక్షితమైన పెట్టుబడి గమ్యంగా మారుతోంది. ఇక్కడ స్థానికులు మాత్రమే కాదు, హైదరాబాద్ వాసులు, గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన వారు కూడా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో పట్టణం మరింత విస్తరించే అవకాశం ఉండటంతో ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడే ఇక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీ లాభాలు సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. కష్టపడి సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులు సూచనలు పాటించడమే ఉత్తమం.

