MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !

Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో పాటు అకాల వర్షాలు, పిడుగుల బీభత్సం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలొని పలు ప్రాంతాల్లో మండే ఎండలతో పాటు వర్షాలు దంచికొడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 24 2026, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నిప్పుల కుంపటిలా మారిన తెలుగు రాష్ట్రాలు.. రికార్డ్ బ్రేక్ ఉష్ణోగ్రతలు
Image Credit : Gemini AI

నిప్పుల కుంపటిలా మారిన తెలుగు రాష్ట్రాలు.. రికార్డ్ బ్రేక్ ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళిపోయింది. మే నెలలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ జనాన్ని ముప్పితిప్పలు పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా ప్రతి ఊరు నిప్పుల కుంపటిలా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 

ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాల్లోని సుమారు 95 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాటాయి. రాబోయే రోజుల్లో మరో 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఏపీలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు
Image Credit : chatgpt

ఏపీలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 45 నుండి 46 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లా కానుమోలులో హయ్యస్ట్‌గా 45.8°C రికార్డైంది.

ఇటు తెలంగాణలో కూడా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఎండతో జనం అల్లాడిపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు వేడి ఉంటోంది. మధ్యాహ్నం 1 గంట దాటిందంటే చాలు, జనం బయటకు రావడానికి భయపడుతుండటంతో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి.

Related Articles

Related image1
IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్.. పంజాబ్, రాజస్థాన్, కేకేఆర్ లలో ఆ లక్కీ టీమ్ ఏది?
Related image2
RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
35
ఒకవైపు ఎండలు.. ఇంకోవైపు గాలివాన బీభత్సం
Image Credit : Asianet News

ఒకవైపు ఎండలు.. ఇంకోవైపు గాలివాన బీభత్సం

ఇదిలా ఉంటే, వాతావరణంలో జరుగుతున్న విచిత్ర మార్పులు జనాలను మరింత బెంబేలెత్తిస్తున్నాయి. తీవ్రమైన ఎండల మధ్యే హఠాత్తుగా వాతావరణం మారిపోయి గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఈ అకాల వర్షాలు, పిడుగుల కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో అరగంట పాటు వీచిన తుపాను లాంటి గాలులకు వందలాది విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి.

45
మరో కొన్ని గంటల్లో భారీ వర్షాలు..
Image Credit : ChatGPT

మరో కొన్ని గంటల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) రాబోయే కొద్ది గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని లేటెస్ట్ వార్నింగ్ ఇచ్చింది. 

ముఖ్యంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వాన పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని అంచనా వేసింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని చెప్తూ అధికారులకు, ప్రజలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

55
ద్రోణి ప్రభావంతో వర్షాలు
Image Credit : stockPhoto

ద్రోణి ప్రభావంతో వర్షాలు

చత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక వాతావరణ ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్పులు జరుగుతున్నాయి. దీని వల్ల రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, కడపతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన లైట్ టు మోడరేట్ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. 

ప్రజలు, ముఖ్యంగా రైతులు ఈ ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు.. ఇక ఉద్యోగులకూ సెలవులే సెలవులు
Recommended image2
Now Playing
Kavitha Protest Viral: ధర్నా చేస్తున్న కవితను రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు| Asianet News Telugu
Recommended image3
ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలు మీ ఇల్లు సేఫ్.. బల్బ్‌లా క‌నిపించే సీక్రెట్ కెమెరా, ఎలా ప‌ని చేస్తుందంటే
Related Stories
Recommended image1
IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్.. పంజాబ్, రాజస్థాన్, కేకేఆర్ లలో ఆ లక్కీ టీమ్ ఏది?
Recommended image2
RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved