India Super 8 Schedule : సూపర్-8 సమరానికి సూర్య సేన రెడీ.. భారత్ ఢీకొట్టే జట్లు ఇవే
India Super 8 Schedule : టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా అవుట్ కావడంతో టీమిండియా సూపర్ 8 గ్రూపు ఖరారైంది. భారత్ తన తదుపరి పోరులో ఏ జట్లతో తలపడనుంది? సూపర్-8 షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆస్ట్రేలియా ఖేల్ ఖతం.. టీమ్ ఇండియాకు సూపర్-8 లో ఎదురేలేదు!
టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ స్టేజ్ మ్యాచులు ముగుస్తున్న తరుణంలో భారత జట్టుకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. బలమైన ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీ నుంచి అవుట్ కావడంతో భారత్ సెమీఫైనల్ దారి మరింత సులభమైందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా అవుట్ కావడంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకోగా, అక్కడ ఏ జట్లతో ఎప్పుడు తలపడాలనే దానిపై స్పష్టత వచ్చేసింది.
సూపర్-8 గ్రూపులో నిలిచిందెవరు?
మంగళవారం పల్లెకెలెలో ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జింబాబ్వేకు ఒక పాయింట్ లభించింది. దీంతో గ్రూప్ బీ నుంచి జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించింది. ఇదే సమయంలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ అయింది. ప్రస్తుత ఛాంపియన్ టీమ్ ఇండియా ఇప్పుడు సూపర్-8 గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూపులో భారత్తో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.
సూపర్ 8 లో సౌతాఫ్రికాతో భారత్ తొలి సమరం
సూపర్-8 దశలో భారత్ తన ప్రయాణాన్ని ఫిబ్రవరి 22న ప్రారంభించనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా తో భారత్ తలపడుతుంది. గత సీజన్ రన్నరప్ అయిన సౌతాఫ్రికా తో జరిగే ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. అనంతరం సూర్య సేన చెన్నైకి పయనం అవుతుంది. అక్కడ ఫిబ్రవరి 26న ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో జింబాబ్వే జట్టుతో తలపడుతుంది. సూపర్-8లో తన చివరి మ్యాచ్ను మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో ఆడుతుంది.
గ్రూప్ స్టేజ్లో అదరగొట్టిన భారత్
గ్రూప్ స్టేజ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆదివారం కొలంబోలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచుల్లో మూడూ గెలిచి 6 పాయింట్లతో గ్రూప్ ఏ టేబుల్ టాప్లో నిలిచింది. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. సూపర్-8 లోనూ ఇదే ఫామ్ను కొనసాగించాలని భావిస్తోంది.
నెదర్లాండ్స్తో భారత్ చివరి లీగ్ మ్యాచ్
సూపర్-8 మ్యాచ్లకు ముందు భారత్ బుధవారం నెదర్లాండ్స్తో తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్లో జరిగే ఈ మ్యాచ్లో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. గతంలో 2022 టీ20 వరల్డ్ కప్లో సిడ్నీలో ఈ రెండు జట్లు తలపడగా, భారత్ విజయం సాధించింది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్లపై గెలిచిన భారత్, నెదర్లాండ్స్ను కూడా ఓడించి అజేయంగా తదుపరి దశకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 22: భారత్ vs సౌతాఫ్రికా, అహ్మదాబాద్
- ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే, చెన్నై
- మార్చి 1: భారత్ vs వెస్టిండీస్, కోల్కతా
భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ లు జరుగుతాయి.
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

