MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • South Indian Temples: అప్పుల బాధ తీరాలంటే ఈ ఆలయాలకు ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందే!

South Indian Temples: అప్పుల బాధ తీరాలంటే ఈ ఆలయాలకు ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందే!

మీరు అప్పుల సమస్యతో బాధపడుతున్నారా? పితృ దోషం వల్ల కష్టాలు పడుతున్నారా? సర్ప దోషం వేధిస్తోందా? అయితే దక్షిణ భారతదేశంలోని ఈ దేవాలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుందట. వెంటనే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చట. మరి ఆ ఆలయాలేంటో ఓసారి తెలుసుకుందామా.  

1 Min read
Kavitha G
Published : Jun 30 2025, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భక్తుల సమస్యలను తీర్చే ఆలయాలు!
Image Credit : Twitter

భక్తుల సమస్యలను తీర్చే ఆలయాలు!

పురణాల ప్రకారం దక్షిణ భారతదేశంలోని కొన్ని దేవాలయాలు.. భక్తులకు ఆర్థిక సమస్యలను దూరం చేస్తాయట. దోషాల నివారణకు, సంపదను పెంచుకోవడానికి ఈ దేవాలయాల సందర్శన సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ దేవాలయాల్లో మొక్కుకుంటే ఎలాంటి సమస్య నుంచైనా ఉపశమనం దక్కుతుందట. మరి ఆ ఆలయాలు ఏంటి? ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

26
రుణ విమోచన లింగేశ్వర ఆలయం
Image Credit : google

రుణ విమోచన లింగేశ్వర ఆలయం

మీరు సందర్శించదగ్గ 5 శక్తివంతమైన దేవాలయాల్లో రుణ విమోచన లింగేశ్వర దేవాలయం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయంలో శివుడు రుణ విమోచకుడిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని దర్శిస్తే అప్పుల బాధ తప్పుతుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Astrology: ఈ ఆలయాలను దర్శిస్తే సొంతింటి కల నేరవేరుతుందట.. ఓసారి వెళ్లిరండి!
Related image2
Temples in india: భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 దేవాలయాలు ఇవే!
36
వరసిద్ధి వినాయకుడు
Image Credit : google

వరసిద్ధి వినాయకుడు

కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయంలోని వినాయక విగ్రహం స్వయంభువుగా వెలిసిందని నమ్మకం. కాణిపాకం వినాయకుడు సత్య ప్రమాణాలకు ప్రతీకగా చెప్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే.. రుణ సమస్యల నుంచి విముక్తి దక్కుతుందట.

46
తిరునాగేశ్వర రాహు దేవస్థానం.
Image Credit : google

తిరునాగేశ్వర రాహు దేవస్థానం.

తిరునాగేశ్వర రాహు దేవస్థానం.. తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉంది. రాహు దోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. రాహు దోషంతో బాధపడుతున్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

56
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
Image Credit : google

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కోనసీమ జిల్లాలో ఉంది. ఈ ఆలయం యాత్రికులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందట. అందుకే దీన్ని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. 

66
సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం
Image Credit : google

సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం

కుక్కె సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కర్ణాటకలో ఉంది. సర్ప దోషాలు, పితృదోషాలు, ఊహించని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
పండుగలు
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
ప్రయాణం
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved