South Indian Temples: అప్పుల బాధ తీరాలంటే ఈ ఆలయాలకు ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందే!
మీరు అప్పుల సమస్యతో బాధపడుతున్నారా? పితృ దోషం వల్ల కష్టాలు పడుతున్నారా? సర్ప దోషం వేధిస్తోందా? అయితే దక్షిణ భారతదేశంలోని ఈ దేవాలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుందట. వెంటనే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చట. మరి ఆ ఆలయాలేంటో ఓసారి తెలుసుకుందామా.

భక్తుల సమస్యలను తీర్చే ఆలయాలు!
పురణాల ప్రకారం దక్షిణ భారతదేశంలోని కొన్ని దేవాలయాలు.. భక్తులకు ఆర్థిక సమస్యలను దూరం చేస్తాయట. దోషాల నివారణకు, సంపదను పెంచుకోవడానికి ఈ దేవాలయాల సందర్శన సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ దేవాలయాల్లో మొక్కుకుంటే ఎలాంటి సమస్య నుంచైనా ఉపశమనం దక్కుతుందట. మరి ఆ ఆలయాలు ఏంటి? ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రుణ విమోచన లింగేశ్వర ఆలయం
మీరు సందర్శించదగ్గ 5 శక్తివంతమైన దేవాలయాల్లో రుణ విమోచన లింగేశ్వర దేవాలయం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయంలో శివుడు రుణ విమోచకుడిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని దర్శిస్తే అప్పుల బాధ తప్పుతుందని పండితులు చెబుతున్నారు.
వరసిద్ధి వినాయకుడు
కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయంలోని వినాయక విగ్రహం స్వయంభువుగా వెలిసిందని నమ్మకం. కాణిపాకం వినాయకుడు సత్య ప్రమాణాలకు ప్రతీకగా చెప్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే.. రుణ సమస్యల నుంచి విముక్తి దక్కుతుందట.
తిరునాగేశ్వర రాహు దేవస్థానం.
తిరునాగేశ్వర రాహు దేవస్థానం.. తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉంది. రాహు దోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. రాహు దోషంతో బాధపడుతున్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కోనసీమ జిల్లాలో ఉంది. ఈ ఆలయం యాత్రికులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందట. అందుకే దీన్ని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు.
సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం
కుక్కె సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కర్ణాటకలో ఉంది. సర్ప దోషాలు, పితృదోషాలు, ఊహించని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.