MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • National
  • రాజకీయాల్లోకి యువ‌ర‌క్తం రావాలి.. ప్రధాని మోడీ పిలుపు

రాజకీయాల్లోకి యువ‌ర‌క్తం రావాలి.. ప్రధాని మోడీ పిలుపు

Independence Day 2024 : భారత దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ‌ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. రాజకీయాల్లోకి కొత్త ర‌క్తం రావాల‌నీ,  యువత దేశసేవకు తరలిరావాలని పిలుపునిచ్చారు. మ‌రీ ముఖ్యంగా రాజకీయ కుటుంబ నేపథ్యం లేని యువకులు  రావాలన్నారు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 15 2024, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Independence Day 2024 : ఎంతో మంది త్యాగ‌ధ‌నుల పోరాటంతో సాధించుకున్న స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల‌తో భార‌త్ ముందుకు సాగుతోంది. దేశం కోసం చేసినవారి త్యాగ‌ల‌ను త‌ల‌చుకుంటూ యావ‌త్ భార‌తావ‌ని నేడు ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు జరుపుకుంటోంది. దేశ 78వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు దేశ‌వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
pm modi

pm modi

భార‌త జాతీయ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన త‌ర్వాత‌  దేశ ప్రజలను ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అసంఖ్యాక సైనికులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనంద‌రిపై ఉందన్నారు. వారి పోరాటం, త్యాగాలు ఎప్ప‌టికీ వ‌రువ‌లేనివ‌ని గుర్తుచేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని వయనాడ్‌లోని కేలారాలో జరిగిన దుర్ఘటనపై కూడా మాట్లాడారు.. 'ఈ ఏడాది కూడా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యంలో చాలా మంది కుటుంబ సభ్యులు, ఆస్తులు కోల్పోయారు. యావ‌త్ దేశం వారికి అండ‌గా ఉంటుంది.. బాధిత  కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

34

అలాగే, తమ ప్రభుత్వం చేపట్టిన భారీ సంస్కరణల కారణంగా భారతీయ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పటిష్టంగా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. "గ‌త బ్యాంకింగ్ రంగం పరిస్థితిని గుర్తుచేసుకోండి.. వృద్ధి లేదు, విస్తరణ లేదు, విశ్వాసం లేదు.. మన‌ బ్యాంకులు కఠినమైన ప‌రిస్థితుల‌ను  ఎదుర్కొన్నాయి. బ‌ల‌మైన‌ బ్యాంకును నిర్మించడానికి మేము పెద్ద సంస్కరణలను తీసుకువ‌చ్చాము. దీంతో ఈ రంగం బలంగా ఉంది.  దాని కారణంగా సంస్కరణలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని బలమైన బ్యాంకుల్లో మన బ్యాంకులు ఉన్నాయి" అని మోడీ అన్నారు.

 

44
Narendra Modi

Narendra Modi

విద్యా వ్య‌వ‌స్థ‌లో కూడా పెద్ద మార్పులు తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలోని వైద్య కళాశాలల్లో 75,000 కొత్త సీట్లు వ‌స్తాయ‌న్నారు. విక్షిత్ భారత్ 2047 కోసం "స్వస్త్ భారత్' కావాలి, ఇందుకోసం రాష్ట్రీయ పోషణ్ మిషన్‌ను ప్రారంభించాం" అని ప్రధాని మోడీ అన్నారు. దేశ రాజ‌కీయాల్లోకి యువ‌ర‌క్తం రావాల‌ని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. దీని కోసం లక్షల‌ మంది యువత దేశ సేవకు రావాలి. మ‌రీ ముఖ్యంగా రాజకీయేతర కుటుంబ నేపథ్యాలు నుంచి యువ‌త దేశ సేవ కోసం రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్ర‌ధాన మోడీ యువ‌త‌కు పిలుపునిచ్చారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం
భారత దేశం
నరేంద్ర మోదీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: 8వ పే కమిషన్ వస్తే పెన్షన్ 50 శాతం పెరగడం పక్కానా? జీతాలు డబుల్?
Recommended image2
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image3
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved