LPG Crisis : హమ్మయ్యా.. హర్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకలు
ప్రధాని మోదీ దౌత్యపరమైన చర్యలతో ప్రమాదకరమైన హర్ముజ్ జలసంధి మార్గం తెరుచుకుందా..? నాలుగు విడతల చర్చల తర్వాత భారత్కు చెందిన శివాలిక్, నందాదేవి ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా దాన్ని దాటాయి. దీంతో భారత్కు ఇంధన సంక్షోభం తప్పినట్లేనా.?

ప్రధాని మోదీ, ఇరాన్ దౌత్యం..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్కు ఓ శుభవార్త అందింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI)కు చెందిన 'శివాలిక్', 'నందాదేవి' అనే రెండు భారీ ఎల్పీజీ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ప్రస్తుతం అవి భారత్ వైపు వస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన, ఉద్రిక్తమైన సముద్ర మార్గాల్లో హర్ముజ్ ఒకటి. ఇటీవలి ఇజ్రాయెల్, అమెరికాచ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో అనేక నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇండియాలో ఎల్పిజి కొరత ఏర్పడింది.
దౌత్య చర్చలతోనే మార్గం సుగమమైందా?
ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించడం యాదృచ్ఛికంగా జరగలేదని సమాచారం. దీని వెనుక భారత్, ఇరాన్ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో ఫిబ్రవరి 28, మార్చి 5, 10, 12 తేదీల్లో నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా గురువారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో నేరుగా సంభాషించారు. ఈ దౌత్యపరమైన ప్రయత్నాల వల్లే భారత నౌకలకు సురక్షిత మార్గం లభించిందని భావిస్తున్నారు.
'శివాలిక్', 'నందా దేవి' నౌకల ప్రత్యేకత ఏంటి?
హర్ముజ్ జలసంధి ఎందుకు ప్రమాదకరంగా మారింది?
ఇటీవల ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ ఆ ప్రాంతంలో అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. దీంతో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వందలాది నౌకల కదలికలు నిలిచిపోయాయి. ఆ సమయంలో భారత జెండాతో ఉన్న సుమారు 28 నౌకలు కూడా అక్కడ చిక్కుకుపోయాయని రిపోర్టులు చెబుతున్నాయి.
ఇతర భారత నౌకల పరిస్థితి ఏంటి?
గల్ఫ్లో ఎంతమంది భారత నావికులు ఉన్నారు?
భారత్కు పెను ఇంధన సంక్షోభం తప్పిందా?
హర్ముజ్ జలసంధి ఎక్కువ కాలం మూసివేసి ఉంటే, అది భారతదేశ ఇంధన సరఫరా, వాణిజ్యం రెండింటినీ దెబ్బతీసేదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే, దౌత్యపరమైన చర్చల ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించడం భారత్కు పెద్ద ఊరటనిచ్చింది.

