MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • బద్ధలైన ఇథియోపియా అగ్నిపర్వతం: భారత్ పై ఎఫెక్ట్ ఎందుకు? విమానయాన సంస్థలు అలర్ట్‌

బద్ధలైన ఇథియోపియా అగ్నిపర్వతం: భారత్ పై ఎఫెక్ట్ ఎందుకు? విమానయాన సంస్థలు అలర్ట్‌

Ethiopia Volcano: ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం బూడిద భారత్ పై ప్రభావితం చూపుతోంది. ముఖ్యంగా వైమానిక ప్రయాణాన్ని ప్రభావితం చేస్తోంది. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ మార్గాల్లో మార్పులు జరిగాయి. కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 24 2025, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ethiopia Hayli Gubbi Volcano భారత్ పై ఎందుకు ప్రభావం చూపిస్తోంది?
Image Credit : X/DisasterAlert2

Ethiopia Hayli Gubbi Volcano భారత్ పై ఎందుకు ప్రభావం చూపిస్తోంది?

ఇథియోపియాలో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం వేల సంవత్సరాల తర్వాత  బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలుకావడంతో భారీ బూడిద, పొగ భారత వైమానిక రూట్ల వైపు కదులుతున్నట్లు ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత డీజీసీఏ అత్యవసర సూచనలు జారీ చేసింది. విమానయాన సంస్థలు అప్రమత్తమైన వెంటనే తమ రూట్లను మార్చుకోవాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని తెలిపింది.

డీజీసీఏ స్పష్టమైన హెచ్చరికలతో పాటు, ఇంజిన్ పనితీరు లోపాలు, కేబిన్‌లో పొగ లేదా విచిత్ర వాసన వంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే నివేదించాలని సూచించింది. విమానాశ్రయాలకు కూడా రన్‌వే పరిస్థితులను పరిశీలించి, అవసరమైనప్పుడు ఫ్లైట్ ఆపరేషన్లను నిలిపివేయాలని ఆదేశించింది.

ప్రమాదకరమైన బూడిద మేఘాలు ఇప్పటికే యెమెన్, ఒమన్ మీదుగా భారత్ వైపు కదులుతున్నాయని వైమానిక పర్యవేక్షణ కేంద్రాలు తెలిపాయి. అంచనా ప్రకారం, ఇవి 12 గంటల్లోనే వాయువ్య, మధ్య భారత ప్రాంతాలను చేరే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్సీఆర్ వైపు దూసుకొస్తున్న బూడిద
Image Credit : X/theinformant_x

గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్సీఆర్ వైపు దూసుకొస్తున్న బూడిద

వాతావరణ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఇథియోపియా అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద మేఘాలు సోమవారం రాత్రి భారత వాయువ్య రాష్ట్రాలపై ప్రభావం చూపనున్నాయి. ఇవి మొదట గుజరాత్‌ను తాకి, తరువాత రాజస్థాన్, ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్ ప్రాంతాల దిశగా ముందుకు సాగనున్నాయని అంచనా వేశారు.

ఈ బూడిద 10 నుంచి 15 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తోంది. ఈ ఎత్తుల్లో వాణిజ్య విమానాలు సాధారణంగా ప్రయాణిస్తాయి. అందువల్ల విమాన ప్రయాణాలు సహజంగానే ప్రభావితం అవుతాయి. “ఈ ప్రభావం నేలపై చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆకాశం మబ్బుల్లా కనిపించడం, తక్కువ ఉష్ణోగ్రతలు, పెరుగుదల వంటి ప్రభావాలు కనిపిస్తాయి” అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం. మోహపాత్ర తెలిపారు.

Related Articles

Related image1
ప్రపంచాన్ని చుట్టేసే పక్షులు: ఏటా 70,000 కిమీ ప్రయాణం.. ఏవో తెలుసా?
Related image2
బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
35
విమానాల రద్దు, మార్గాల్లో మార్పులు
Image Credit : X/theinformant_x

విమానాల రద్దు, మార్గాల్లో మార్పులు

ఇథియోపియా హైలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వస్తున్న బూడిద మేఘాలు రెడ్ సీ దాటి మధ్యప్రాచ్యం వైపు కదిలిన వెంటనే భారత విమానయాన సంస్థలు ఫ్లైట్లను రద్దు చేయడం, మార్గాలు మార్చడం ప్రారంభించాయి. ఇండిగో ఇప్పటికే ఆరు ఫ్లైట్లు రద్దు చేసింది. వాటిలో ఒకటి ముంబై నుంచి బయలుదేరినదని అధికారులు తెలిపారు.

కన్నూరు-అబుదాబి 6E 1433 ఫ్లైట్ సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వైపు మళ్లించారు. అబుదాబిలో దిగిన మరో భారతీయ విమానానికి ఇంజిన్ తనిఖీలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ గగనతలం భారత ఫ్లైట్లకు మూసివేసిన కారణంగా, మార్గాల మార్పులు మరింత సంక్లిష్టంగా మారాయని సమాచారం.

మంగళవారం ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే పరిస్థితులు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నాయని తెలిపారు.

45
బూడిద, సల్ఫర్ డయాక్సైడ్‌తో విస్తరించిన మేఘాలు
Image Credit : X/DisasterAlert2

బూడిద, సల్ఫర్ డయాక్సైడ్‌తో విస్తరించిన మేఘాలు

ఇథియోపియా హైలీ గుబ్బి అగ్నిపర్వతం సుమారు 12,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటం చెందడం ప్రపంచ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. 10 నుంచి 15 కి.మీ ఎత్తుకు బూడిద, పొగ ఎగసిపడినట్లు టూలూస్ అశ్ అడ్వయిసరీ సెంటర్ వెల్లడించింది. యెమెన్, ఒమన్, భారత్, ఉత్తర పాకిస్తాన్ వైపు బూడిద మేఘాలు ప్రయాణిస్తున్నాయి.

ఒమన్ పర్యావరణ సంస్థలు పర్యవేక్షణ స్టేషన్ల ద్వారా గాలి నాణ్యతను పరిశీలిస్తున్నాయి. ఇప్పటివరకు భారీ కలుషితాలను గుర్తించలేదు. నఖీ అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా అక్కడి ప్రజలకు రియల్ టైం గాలి నాణ్యత సమాచారం అందిస్తున్నారు.

55
ఢిల్లీ ఎన్సీఆర్ ఇప్పటికే కాలుష్యం.. బూడిద ప్రభావంతో మరింత దెబ్బ?
Image Credit : Getty

ఢిల్లీ ఎన్సీఆర్ ఇప్పటికే కాలుష్యం.. బూడిద ప్రభావంతో మరింత దెబ్బ?

ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4 గంటలకు AQI 382 వద్ద నమోదు అయ్యింది. ఘాజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 390ల దగ్గరే ఉంది. బూడిద మేఘాలు ఈ ప్రాంతాల్లోకి వస్తే కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే అది నేలస్థాయిలో ఎంత ప్రభావం చూపుతుందో ఇంకా స్పష్టత లేదు.

వాతావరణ విశ్లేషకుల ప్రకారం.. బూడిద మేఘాలు గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో భారత్ వైపు కదులుతున్నాయి. ఇవి 15,000 నుంచి 45,000 అడుగుల ఎత్తుల్లో ప్రయాణిస్తున్నాయి. దీంతో ఆకాశం మరింత నల్లబడే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వాతావరణం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
Recommended image2
Now Playing
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
Recommended image3
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Related Stories
Recommended image1
ప్రపంచాన్ని చుట్టేసే పక్షులు: ఏటా 70,000 కిమీ ప్రయాణం.. ఏవో తెలుసా?
Recommended image2
బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved