MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Gold: భూమి తవ్వుతున్నప్పుడు బంగారం దొరికితే అది ఎవరి సొంతమవుతుంది? చట్టంలో ట్విస్ట్‌

Gold: భూమి తవ్వుతున్నప్పుడు బంగారం దొరికితే అది ఎవరి సొంతమవుతుంది? చట్టంలో ట్విస్ట్‌

పాత ఇంటిలో నిధి దొరికింది, పొలం తవ్వుతున్నప్పుడు బంగారం బయటపడింది. ఇలాంటి వాటి గురించి ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. అయితే ఇలా దొరికిన బంగారంపై ఎవరికి హక్కులు ఉంటాయి.? అసలు చట్టం ఏం చెబుతోంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

1 Min read
Narender Vaitla
Published : Mar 20 2025, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gold

Gold

'పలానా వాళ్ల ఇంట్లో నిధి ఉందంటా. పాత ఇంటిని కూల్చుతున్న సమయంలో బంగారం బయటపడిందంటా, దీంతో రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారంటా'.. ఇలాంటివి మనం జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కథలు ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. ఇందులో నిజమెంత ఉంటుందో కానీ వినడానికి మాత్రం చాలా బాగుంటాయి. 

24
Gold Mine

Gold Mine

అయితే భూమిలో నిధి లేదా బంగారం దొరికితే అది దొరికిక వ్యక్తికి చెల్లదని మీకు తెలుసా.? అది మీ ఇంట్లో అయినా సరే ఆ బంగారంపై మీకు ఎలాంటి హక్కులు ఉండవు. నిజానికి భారతదేశంలో నిధి కోసం తవ్వడం చట్టవిరుద్ధం. దీనికి సంబంధించి 1960లో ఒక చట్టం చేశారు. దీని ప్రకారం భారత పురావస్తు శాఖ తవ్వకంపై పూర్తి హక్కును కలిగి ఉంటుంది. భూమి తవ్వుతున్నప్పుడు బంగారం దొరికితే, ఆ భూమి యజమాని ఎవరు అనే దానితో సంబంధం లేకుండా అది ప్రభుత్వానికి చెందుతుంది.  
 

34

భూమి తవ్వుతున్నప్పుడు నిధి లేదా బంగారం దొరికితే.. 1971లో రూపొందించిన ట్రెజర్ యాక్ట్ కింద చర్య తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారం నిధిని కనుగొన్న వ్యక్తి దాని గురించి పోలీసులకు లేదా అధికారులకు తెలియజేయాలి. ఆ తర్వాత అధికారులు దానిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. ఒకవేళ ఆ వస్తువుకు ఏదైనా పురావస్తు ప్రాముఖ్యత కలిగి ఉంటే, దానిని అధ్యయనం కోసం పురావస్తు శాఖకు పంపుతారు. 
 

44

అయితే భూమిలో లభ్యమైన బంగారం లేదా ఏదైనా వస్తువు తనదేనని కోర్టులో నిరూపించుకోగలిగితే ఆ వ్యక్తికి బంగారం చెందుతుంది. ఒకవేళ తవ్వకాల్లో బంగారం దొరికిన విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేయకపోతే.. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అరెస్టు చేయవచ్చు. మీపై కేసు కూడా నమోదవుతుంది. దీని ప్రకారం.. 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
బంగారం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved