MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • నక్సల్స్ దేశ భద్రతకు ముప్పు : ప్రధాని మోదీ

నక్సల్స్ దేశ భద్రతకు ముప్పు : ప్రధాని మోదీ

PM Modi on Naxalism : దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ "అనేక అడ్డంకులు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ భారత్ ఇప్పుడు అన్​స్టాపబుల్​" అని అన్నారు. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 17 2025, 11:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యువత భవిష్యత్తుకు ముప్పు: ప్రధాని మోదీ
Image Credit : ANI

యువత భవిష్యత్తుకు ముప్పు: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నక్సలిజం అంశంపై మాట్లాడుతూ.. ఇది కేవలం భద్రతా సమస్య మాత్రమే కాకుండా యువత భవిష్యత్తుకు కూడా ముప్పుగా మారిందని తెలిపారు. నక్సలిజం అనే పదం వాస్తవానికి మావోవాద ఉగ్రవాదం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అర్బన్ నక్సల్స్ ఏర్పరచిన ఎకోసిస్టమ్ మావో ఉగ్రవాదాన్ని దాచిపెట్టడంలో పెద్ద పాత్ర వహించిందని ఆయన ఆరోపించారు.

25
వారి కథలు వెలుగులోకి రాలేదు : ప్రధాని మోదీ
Image Credit : Getty

వారి కథలు వెలుగులోకి రాలేదు : ప్రధాని మోదీ

మావోయిస్టు దాడుల బాధితుల కథలు వెలుగులోకి రాలేదని ప్రధాని మోదీ అన్నారు. చేతులు కాళ్లు కోల్పోయిన గ్రామీణులు, రైతుల కుమారులు, ఆదివాసీ మహిళలు.. ఢిల్లీలో సమావేశమైనప్పటికీ, వారి బాధ దేశ ప్రజలకు తెలియకుండా అడ్డుకున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మీడియా, అర్బన్ నక్సల్స్ కలసి ఈ ఉగ్రవాదం వెనుక ఉన్న నిజాలను దాచారని ఆయన విమర్శించారు.

Related Articles

Related image1
అన్​స్టాపబుల్ ఇండియా.. సర్జికల్ స్ట్రైక్‌లు కొనసాగుతూనే ఉంటాయి : ప్రధాని మోదీ
Related image2
దీపావళి ఆఫర్‌: ఫ్రీగా బంగారం ఇస్తున్న జియో !
35
2014 తర్వాత భారీ మార్పులు
Image Credit : Getty

2014 తర్వాత భారీ మార్పులు

ప్రధాని వెల్లడించిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం దేశంలో 125కు పైగా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా, ప్రస్తుతం కేవలం 11 జిల్లాల్లో మాత్రమే ఈ ప్రభావం మిగిలి ఉంది. వీటిలో మూడు జిల్లాలు అత్యధికంగా ప్రభావితమై ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలతో వేలాది నక్సల్స్ ఆయుధాలు వదిలి జనంలో కలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

45
75 గంటల్లో 303 నక్సల్స్ లొంగిపోయారు
Image Credit : Getty

75 గంటల్లో 303 నక్సల్స్ లొంగిపోయారు

గత 75 గంటల్లో 303 మంది నక్సల్స్ లొంగిపోయారని ప్రధాని మోదీ తెలిపారు. వీరిలో కొందరిపై ₹1 కోటి, ₹15 లక్షలు, ₹5 లక్షల వరకు రివార్డులు కూడా గతంతో ప్రకటించిన విషయాలు ప్రప్తావించారు. వీరు ఇప్పుడు రాజ్యాంగాన్ని స్వీకరించి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు. మావోయిస్టు ఉగ్రవాదం దశాబ్దాల పాటు వేలాది ప్రాణాలను తీసిందనీ, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మాణం జరగకుండా అడ్డుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

55
బస్తర్ లో మార్పులు.. అభివృద్ధి, ఆశల దీపావళి
Image Credit : Getty

బస్తర్ లో మార్పులు.. అభివృద్ధి, ఆశల దీపావళి

ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన బస్తర్ ఇప్పుడు క్రీడా ఉత్సవాలకు కేంద్రంగా మారిందని ప్రధాని అన్నారు. “బస్తర్ ఒలింపిక్స్”లో వేలాది యువకులు పాల్గొంటున్నారనీ, ఈ సంవత్సరం మావోయిస్టు ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. “దేశం మావోయిస్టు ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తికావడానికి ఎంతో దూరంలో లేదు. ఇది మోదీ గ్యారంటీ” అని తన ప్రసంగం ముగించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్
పాకిస్తాన్
ఆపరేషన్ సింధూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Extramarital affair : అర్థరాత్రి కోడలి గదిలో మామ స్నేహితుడు... ఇద్దరి రాసలీలలు చూసి అత్త షాక్..!
Recommended image2
భార్య వివాహేతర సంబంధం... ఏకంగా పుస్తకమే రాసిన భర్త..!
Recommended image3
Now Playing
Budget 2026–27 | Nirmala Sitaraman on Imports & Exports | Custom Process | Asianet News Telugu
Related Stories
Recommended image1
అన్​స్టాపబుల్ ఇండియా.. సర్జికల్ స్ట్రైక్‌లు కొనసాగుతూనే ఉంటాయి : ప్రధాని మోదీ
Recommended image2
దీపావళి ఆఫర్‌: ఫ్రీగా బంగారం ఇస్తున్న జియో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved