- Home
- National
- Make Reel And Win 15000: రీల్స్ చేస్తే డబ్బులు ఇస్తాం.. ప్రభుత్వం బంపర్ ఆఫర్.. డిజిటల్ ఇండియా కాంటెస్ట్ వివరాలు మీకోసం
Make Reel And Win 15000: రీల్స్ చేస్తే డబ్బులు ఇస్తాం.. ప్రభుత్వం బంపర్ ఆఫర్.. డిజిటల్ ఇండియా కాంటెస్ట్ వివరాలు మీకోసం
Digital India Reel Contest: డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. 'రీల్ కాంటెస్ట్' నిర్వహిస్తోంది. రీల్స్ చేసిన వారికి డబ్బులిస్తోంది ! ఆ వివరాలు మీకోసం..

డిజిటల్ ఇండియా 10 ఏళ్ల వేడుక.. రీల్ కాంటెస్ట్ ప్రారంభించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్కు 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా రీల్ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. జూలై 1న ప్రారంభమైన ‘A Decade of Digital India – Reel Contest’ ఆగస్టు 1తో ముగియనుంది.
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ డికేడ్ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం యువతకు, కంటెంట్ క్రియేటర్లకు తమ టాలెంట్ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పోటీ ద్వారా ప్రజలు తమ జీవితాల్లో డిజిటల్ సేవల ప్రభావాన్ని వీడియో రూపంలో తెలియజేయవచ్చు. ఈ రీల్స్ చేసిన వారికి ప్రభుత్వం ప్రైజ్ మనీ కూడా ఇవ్వనుంది.
డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ లో ఎలా పాల్గొనాలి?
ఈ పోటీలో పాల్గొనాలంటే, మీరు డిజిటల్ ఇండియా తో మీ అనుభవాన్ని కలిగిన 1 నిమిషం రీల్ను తయారు చేసి https://innovateindia.mygov.in వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ వీడియోను MP4 ఫార్మాట్లో, పోర్ట్రెయిట్ మోడ్లో సబ్మిట్ చేయాలి. వీడియో పూర్తిగా ఒరిజినల్గా ఉండాలి. ఇంతకు ముందు ఎక్కడా పోస్ట్ చేయకూడని రీల్ అయి ఉండాలి.
డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ : ఏ విషయాలపై రీల్ చేయాలి?
డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ లో రీల్స్ కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అంశాలను పేర్కొంది. వాటిలో ఇవి ఉన్నాయి..
• డిజిటల్ ఇండియా దేశ చిత్రాన్ని ఎలా మార్చింది?
• మీరు BHIM UPI, UMANG, DigiLocker, eHospital వంటి ప్లాట్ఫార్మ్స్ను ఎలా ఉపయోగించారు?
• డిజిటల్ విద్య, ఆరోగ్యం, గవర్నెన్స్, డిజిటల్ పేమెంట్స్పై ఈ కార్యక్రమం ప్రభావం ఎలా చూపించింది?
• మీ కమ్యూనిటీ లేదా కుటుంబ కథలో ఈ ప్రోగ్రామ్ ఎలా మార్పు తీసుకొచ్చింది?
డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ : విన్నర్లు ఎంత ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు?
డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 100 మంది విజేతలకు నగదు బహుమతులు అందించనుంది:
• టాప్ 10 విజేతలకు: రూ. 15,000
• సెకండ్ ప్లేస్ లోని 25 మందికి: రూ. 10,000
• థర్డ్ ప్లేస్ లోని 50 మందికి: రూ. 5,000
ఈ బహుమతులతో పాటు, విజేతలకు ప్రత్యేక గుర్తింపు ‘గవర్నమెంట్ ట్యాగ్’ రూపంలోనూ లభిస్తుంది.
డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ చివరి తేదీ ఎప్పుడు? రీల్ ను ఎప్పటివరకు అప్లోడ్ చేయాలి?
డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ ఆఖరి తేదీ ఆగస్టు 1, 2025. మీరు ఈ పోటీలలో పాల్గొనాలంటే ఆలస్యం చేయకుండా మీ సృజనాత్మకతను కెమెరా ముందు చూపించండి. ఇది యువతకు ఒక సువర్ణావకాశం. ప్రభుత్వ ప్రోత్సాహంతో మీరు మీ టాలెంట్ను దేశమంతటా ప్రదర్శించవచ్చు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు ఆగస్టు 1 లోపు మీ వీడియోను అప్లోడ్ చేయాలి.
గ్రామీణ భారతం శుభ్రతపై కూడా రీల్ పోటీలు
డిజిటల్ ఇండియా పోటీతో పాటు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ శుభ్రతపై కూడా ప్రత్యేక రీల్ పోటీని ప్రారంభించింది. ఈ పోటీలో 90 నుంచి 150 సెకన్ల మధ్య వీడియోను MP4, MOV లేదా AVI ఫార్మాట్లో తయారుచేసి https://www.mygov.in/ వెబ్సైట్లో జూలై 31, 2025లోపు అప్లోడ్ చేయాలి. ప్రతినెలా టాప్ 5 వీడియోలకు రూ. 5,000 బహుమతిగా ఇవ్వనున్నారు.
ఈ పోటీకి సంబంధించి వీడియోలో గ్రామంలో నీటి సరఫరా, శౌచాలయాలు, శుభ్రత అవగాహన, చెత్త నిర్వహణ, మహిళా భాగస్వామ్యం వంటి అంశాలను చూపించాలి. వీడియోలో స్థానిక భాష ఉపయోగించినా, తప్పనిసరిగా హిందీ లేదా ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉండాలి.
ఈ రెండు పోటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చైతన్యం, గ్రామీణ శుభ్రత పై ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా, యువతకు బహుమతులతో పాటు గుర్తింపు ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మీరు ఒక రీల్ క్రియేటర్ అయితే, ఇది మీకు ఒక సువర్ణావకాశం. ఇంకెందుకు ఆలస్యం రీల్ చేయండి మరి !