MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • తెలంగాణ, ఆంధ్రలో మరో తుపాను.. దూసుకొస్తున్న సేన్యార్.. ఐఎండీ బిగ్ అలర్ట్

తెలంగాణ, ఆంధ్రలో మరో తుపాను.. దూసుకొస్తున్న సేన్యార్.. ఐఎండీ బిగ్ అలర్ట్

Heavy Rain Senyar Cyclone : సేన్యార్ తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 22 2025, 06:01 PM IST| Updated : Nov 22 2025, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బే ఆఫ్ బెంగాల్‌లో అల్పపీడనం.. మరో తుపాను హెచ్చరిక
Image Credit : Asianet News

బే ఆఫ్ బెంగాల్‌లో అల్పపీడనం.. మరో తుపాను హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలు సైక్లోన్ మోంథా దాటికి ఇప్పటికీ కోలుకోకముందే, మరో కొత్త తుపాను హెచ్చరికతో ఆందోళన పెరిగింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం, బే ఆఫ్ బెంగాల్‌ దక్షిణ–తూర్పు భాగంలో ఏర్పడుతున్న అల్ప పీడనం కారణంగా వచ్చే రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈ అల్ప పీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదలుతూ 24వ తేదీకి తీవ్రంగా మారనుంది. అనంతరం దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించి, వచ్చే 48 గంటల్లో ‘సేన్యార్’ పేరుతో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

25
అప్రమత్తంగా తెలుగు రాష్ట్రాలు
Image Credit : Generated by google gemini AI

అప్రమత్తంగా తెలుగు రాష్ట్రాలు

ఐఎండీ ప్రకారం.. నవంబర్ 26 నుండి ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా నవంబర్ 28న దక్షిణ తీర ప్రాంతాలు, రాయలసీమ సరిహద్దు జల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు నెల్లూరు, కృష్ణా జిల్లాల వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా.

తమిళనాడులో 24వ తేదీ నుంచే వర్షాలు ప్రారంభమవుతాయని, 26 వరకు నిరంతర వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, బంగాళాఖాతం మీదుగా ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పు కారణంగా తుపాను దిశలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తుపాను కాకినాడ, మచిలీపట్నం మధ్య భూభాగాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా.

Related Articles

Related image1
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు
Related image2
దుబాయ్‌ ఎయిర్‌షో లో కూలిన భారత యుద్ధ విమానం తేజస్
35
రైతులకు హెచ్చరికలు
Image Credit : Perplexity AI

రైతులకు హెచ్చరికలు

నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, రాయలసీమలో ఉన్న వరి సాగుదారులు, ఇతర రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. నీటి ముంపు ప్రమాదం ఉన్నందున పంటలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. వరి, పత్తి తదితర పంటలకు సంబంధించి అప్రమత్తత సూచనలు విడుదల చేసింది.

45
దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు
Image Credit : Generated by google gemini AI

దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు

దక్షిణ రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

అండమాన్–నికోబార్ దీవులు : నవంబర్ 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ, గాలులు గంటకు 55 కిమీ వేగంతో వీచే అవకాశం వుందని ఐఎండీ హెచ్చరించింది.

తమిళనాడు, కేరళ : నవంబర్ 22 నుండి 26 వరకు వర్షాలు కురుస్తాయనీ, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. 

ఈశాన్య రాష్ట్రాలు: నాగాలాండ్, మణిపూర్, తూర్పు అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయి.

55
ఉత్తర భారతంతో చలి పంజా
Image Credit : Generated by google gemini AI

ఉత్తర భారతంతో చలి పంజా

ఢిల్లీ ఎన్సీఆర్ : చలి తీవ్రత పెరగగా, కాలుష్యం పరిస్థితిని మరింత దిగజార్చింది. నవంబర్ 22న కనిష్ట ఉష్ణోగ్రత 10–12°C, 23న మరో 1–2°C తగ్గే అవకాశం ఉంది..

జార్ఖండ్ : రాత్రి ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా 2 డిగ్రీలు పెరిగే అవకాశం. 23వ తేదీ నుండి మళ్లీ తగ్గుదల ఉంటుంది. 26–27న తీవ్ర చలి ఉంటుంది.

యూపీ : కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 9–13°C మధ్య, గరిష్ఠం 25–28°C మధ్య ఉంటాయి.

రాజస్థాన్, బీహార్ : బీహార్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత అధికం అయింది. పొగమంచు, చలి గాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌లో కూడా తీవ్ర శీతల వాతావరణం నమోదైంది.

నవంబర్ 25 వరకు వేగంగా వీచే గాలుల, తుపాను ప్రభావం కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఐఎండీ సూచించింది. తుపాను సేన్యార్ ప్రభావం వచ్చే వారం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
బెంగళూరు
అమరావతి
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Leopard Attacks: పులులదాడి నుండి తప్పించుకోడానికిఆ వీళ్లుఏంచేస్తున్నారో చూడండి | Asianet News Telugu
Recommended image2
ఎవరీ రామరాజు మంతెన..? ఆయన నెట్ వర్త్ ఎంతో తెలుసా?
Recommended image3
వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్.. తెలుగు వారి పెళ్లికి ట్రంప్ కొడుకు, జెనిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్ ఇంకా ఎందరో
Related Stories
Recommended image1
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు
Recommended image2
దుబాయ్‌ ఎయిర్‌షో లో కూలిన భారత యుద్ధ విమానం తేజస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved