MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !

Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !

Online Reception : ఇండిగో విమానాల రద్దు కారణంగా భువనేశ్వర్ నుండి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు రాలేకపోయారు. దీంతో వధూవరులు లేకుండానే హుబ్బళ్లిలో వారి వివాహ రిసెప్షన్ ఆన్‌లైన్‌లో జరిగింది. ఈ అరుదైన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

2 Min read
Mahesh Rajamoni
Published : Dec 05 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హుబ్బళ్లిలో వింత రిసెప్షన్: వధూవరులు లేకుండానే వేడుక !
Image Credit : Getty

హుబ్బళ్లిలో వింత రిసెప్షన్: వధూవరులు లేకుండానే వేడుక !

ఇండిగో విమానాల రద్దు ఒక కొత్త జంట జీవితంలో ఊహించని మలుపు తిప్పింది. బుధవారం దేశవ్యాప్తంగా 200లకు పైగా విమానాలు రద్దు కావడంతో, వివాహ రిసెప్షన్‌కు వధూవరులే హాజరు కాలేకపోయారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరగాల్సిన ఈ రిసెప్షన్.. చివరికి అతిథులు, తల్లిదండ్రుల సమక్షంలో ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సాంకేతికత సహాయంతో జరిగిన ఈ అరుదైన వర్చువల్ రిసెప్షన్ వైరల్ గా మారింది. 

25
ప్రేమించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు
Image Credit : Asianet News

ప్రేమించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు

బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న హుబ్బళికి చెందిన మేఘా క్షీరసాగర, భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమ్మతితో వారి వివాహం నవంబర్ 23న భువనేశ్వర్‌లో జరిగింది. వధువు స్వస్థలమైన హుబ్బళ్లిలో డిసెంబర్ 3న రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఇందుకోసం హుబ్బళ్లిలోని గుజరాత్ భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరపు బంధువులు కూడా రిసెప్షన్‌కు వచ్చారు.

Related Articles

Related image1
వెండి మెరుపు రికార్డులు.. రూ. 2 లక్షలు ఎప్పుడు దాటుతుంది?
Related image2
పదేళ్లలో రెట్టింపైన భారత విదేశీ రుణం.. మీపై ఎంత అప్పు ఉందో తెలుసా?
35
వధూవరులు అಲస్యం బంధువుల ఆగ్రహం
Image Credit : Asianet News

వధూవరులు అಲస్యం బంధువుల ఆగ్రహం

వధూవరులు భువనేశ్వర్ నుంచి బెంగళూరు మీదుగా హుబ్బళ్లికి డిసెంబర్ 2న విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. కొంతమంది బంధువులకు భువనేశ్వర్ నుండి ముంబై, అక్కడి నుండి హుబ్బళ్లికి విమాన టిక్కెట్లు బుక్ అయ్యాయి. అయితే, డిసెంబర్ 2 ఉదయం 9 గంటల నుండి మరుసటి రోజు (డిసెంబర్ 3) తెల్లవారుజామున 4-5 గంటల వరకు విమానం ఆలస్యం అవుతోందని చెప్పిన ఇండిగో సిబ్బంది, డిసెంబర్ 3 ఉదయం చివరకు విమానం రద్దు అయినట్లు ప్రకటించారు. దీంతో, ప్రత్యామ్నాయ మార్గం లేక వధూవరులు, వారి తల్లిదండ్రులు భువనేశ్వర్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.

45
హుబ్బళ్లిలో వర్చువల్ రిసెప్షన్
Image Credit : Asianet News

హుబ్బళ్లిలో వర్చువల్ రిసెప్షన్

మరోవైపు, హుబ్బళ్లిలో వధువు తల్లిదండ్రులు, బంధువులు వారికోసం ఎదురుచూస్తున్నారు. కళ్యాణ మండపం బుక్ అవ్వడం, అన్ని ఏర్పాట్లు పూర్తికావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. చివరికి, హుబ్బళ్లిలో వధువు తల్లిదండ్రులే వధూవరుల కుర్చీల్లో కూర్చుని శాస్త్రం ముగించారు. భువనేశ్వర్‌లో వధూవరులు కూడా సిద్ధమై కూర్చున్నారు. ముహూర్తానికి సరిగ్గా ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే రిసెప్షన్‌ను పూర్తి చేశారు.

55
అతిథుల ఆశీర్వాదాలు, వధువు తండ్రి ఏం చెప్పారంటే?
Image Credit : Gemini

అతిథుల ఆశీర్వాదాలు, వధువు తండ్రి ఏం చెప్పారంటే?

రిసెప్షన్‌కు వచ్చిన బంధువులు వర్చువల్‌గా వధూవరులను చూసి ఆశీర్వదించి, వారి తల్లిదండ్రులకు బహుమతులు ఇచ్చారు. వధూవరులు కూడా ఆన్‌లైన్‌లోనే హుబ్బళ్లిలో ఉన్న బంధువుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వధువు తండ్రి అనిల్ కుమార్ క్షీరసాగర్ మాట్లాడుతూ.. ఇండిగో సంస్థ ఒకటి రెండు రోజుల ముందుగా విమానం రద్దు అయిన విషయాన్ని తెలియజేసి ఉంటే, తాము వేరే మార్గంలోనైనా వచ్చి రిసెప్షన్‌లో పాల్గొనేవాళ్లమని చెప్పారు.

బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విమానం ఇప్పుడు బయలుదేరుతుంది, అప్పుడు బయలుదేరుతుంది అంటూ చివరి వరకు కాలయాపన చేయడంతో పాటు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లనే వధూవరులు లేకుండానే రిసెప్షన్ చేయవలసి వచ్చిందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చివరకు ఆన్‌లైన్‌లో పాల్గొన్నందుకు సరిపోయిందని, అంతటితో సంతృప్తి చెంది అందరూ రిసెప్షన్ భోజనానికి సిద్ధమయ్యారని ఆయన చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బెంగళూరు
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Recommended image2
Now Playing
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu
Recommended image3
Now Playing
Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Related Stories
Recommended image1
వెండి మెరుపు రికార్డులు.. రూ. 2 లక్షలు ఎప్పుడు దాటుతుంది?
Recommended image2
పదేళ్లలో రెట్టింపైన భారత విదేశీ రుణం.. మీపై ఎంత అప్పు ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved