MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఢిల్లీ పేలుడు గురించి ముందే చెప్పిన జ్యోతిష్యుడు-డిసెంబర్ లో కూడా ఆయన చెప్పిందే జరగనుందా?

ఢిల్లీ పేలుడు గురించి ముందే చెప్పిన జ్యోతిష్యుడు-డిసెంబర్ లో కూడా ఆయన చెప్పిందే జరగనుందా?

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన భారీ పేలుడు గురించి తెలిసిందే. అయితే ఈ పేలుడు గురించి ఓ జ్యోతిష్యుడు ఆగస్టులోనే చెప్పారు. అంతేకాదు డిసెంబర్ లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని కొన్ని నెలల క్రితమే ఆయన అంచనా వేశారు.

2 Min read
Kavitha G
Published : Nov 11 2025, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఢిల్లీ పేలుడు గురించి ముందే చెప్పిన జ్యోతిష్యుడు
Image Credit : stockPhoto

ఢిల్లీ పేలుడు గురించి ముందే చెప్పిన జ్యోతిష్యుడు

ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించేలా చేసింది. ఢిల్లీ కారు పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొంతమంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ కారు పేలుడు ఘటనలో 10 మందికి పైగా చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ కారు పేలుడు గురించి ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని ఆగస్టులోనే జోస్యం చెప్పారు. అంతేకాదు డిసెంబర్ నెలలో పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం ఏర్పడుతుందని కూడా చెప్పారు.

24
ఆగస్టు 20 న సూచన..
Image Credit : Meta AI

ఆగస్టు 20 న సూచన..

ఆగస్టు 20న జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని ఢిల్లీ పేలుడు గురించి సూచన ఇచ్చారు. ఆగస్టు 20న ట్వీట్ చేసిన ఆయన నవంబర్ లేదా డిసెంబర్ నెలలో పహల్గామ్ 2 జరుగుతుందని జోస్యం చెప్పారు. కిని స్పష్టంగా ఢిల్లీ కారు పేలుడు అని చెప్పలేదు. కానీ పహల్గామ్ లాంటి ఉగ్రదాడి ఒకటి నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగుతుందని అంచనా వేశారు. ఇప్పుడు కిని జోస్యం చెప్పినట్టే జరిగింది. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యే అని ప్రశాంత్ కిని అన్నారు.

Related Articles

Related image1
ఢిల్లీ పేలుడు వెన‌కాల పాకిస్థాన్ హ‌స్తం..? షియా మ‌త‌పెద్ద కీల‌క‌ వ్యాఖ్య‌లు
Related image2
ఢిల్లీ పేలుడు సూత్రధారి ఇతడేనా.? వైరల్ అవుతోన్న నిందితుడి ఫొటో
34
డిసెంబర్ లో ఆపరేషన్ సిందూర్ 2?
Image Credit : Asianet News

డిసెంబర్ లో ఆపరేషన్ సిందూర్ 2?

పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఎదురుదాడి చేసినప్పుడు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్ ఎదురుదెబ్బకు తలొగ్గిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు అభ్యర్థించింది. దీంతో యుద్ధం మొదలవకముందే ముగిసింది. దీని గురించి జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని ఆగస్టులో జోస్యం చెప్పారు. భారత్, పాకిస్థాన్ యుద్ధం ఎప్పుడు అని కొందరు ఆయన్ని అడగగా.. 2025 డిసెంబర్ 3వ వారం అని సమాధానమిచ్చారు. ఆ సమయంలో కొన్ని సంఘటనలు పాకిస్థాన్‌పై యుద్ధం చేసేలా చేస్తాయని ప్రశాంత్ కిని అంచనా వేశారు. డిసెంబర్‌లో భారత్ ఆపరేషన్ సిందూర్ 2 చేపడుతుందని ఆయన జోస్యం చెప్పారు.

44
ఉగ్రవాద చర్యే..
Image Credit : ANI

ఉగ్రవాద చర్యే..

ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు పేలుడు స్పష్టంగా ఉగ్రవాద చర్యేనని ప్రశాంత్ కిని అన్నారు. పహల్గామ్ 2 లాంటి దాడికి భారీ సన్నాహాలు జరిగాయి. అందులో ఒకటి ఢిల్లీ కారు పేలుడు. భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు సీఎన్‌జీ పేలుడు వల్ల 10 మంది చనిపోరు. 30 మంది గాయపడరు. కొందరు దీన్ని సీఎన్‌జీ పేలుడు అని చెబుతున్నారు. కానీ ఇది స్పష్టంగా ఉగ్రవాద చర్యేనని కిని పేర్కొన్నారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
భారత దేశం
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved