Biryani: బిర్యానీతో పాటు రైతా ఎందుకు ఫ్రీగా ఇస్తారు..? చాలా మందికి తెలియని కారణం ఇదే..!
Biryani: బిర్యానీ ఆర్డర్ చేసిన ప్రతిసారీ.. చిన్న రెస్టారెంట్ దగ్గర నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు రైతా ఫ్రీగా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? దీని వెనక కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా?

బిర్యానీ తో రైతా..
బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? రోజూ బిర్యానీ పెట్టినా కూడా ఇష్టంగా తినేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇక చాలా మందికి.. బిర్యానీ ఫుల్ గా తినేసి... లాస్ట్ ముద్దలో.. అందులో రైతా కలుపుకొని తినడానికి ఇష్టపడతారు. అలా తినకపోతే బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా రాదు. అయితే, మీరు గమనించారా? మీరు చిన్న రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా, పెద్ద రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసినా.. లేదా.. ఏదైనా హోటల్ కి వెళ్లి బిర్యానీ తిన్నా కూడా రైతా మనకు ఫ్రీగా ఇస్తారు. పెరుగులో ఉల్లిపాయ వేసి తయారు చేసిన రైతా ఇస్తారు. అసలు.. బిర్యానీతో రైతా మనకు ఎందుకు ఫ్రీగా ఇస్తారు? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?
మసాలా కారం తగ్గించడానికి..
బిర్యానీ తయారీలో మిరియాలు, మిర్చీ , గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క వంటి ఘాటైన మసాలాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవన్నీ చాలా ఘాటుగా ఉంటాయి. ఈ మంటను తగ్గించడానికి రైతా తినమని చెబుతారు. రైతాలో పెరుగులో ఉండే కొవ్వు, ప్రోటీన్లు నోటీలో మంటను కొంత వరకు తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది...
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవన్నీ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బిర్యానీ లాంటి హెవీ భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియకు కొంత వరకు సహాయపడే అవకాశం ఉంది. సులభంగా అరగడానికి సహాయపడుతుంది.
శరీరానికి చల్లదనం...
బిర్యానీ వేడిగా, మసాలాలతో నిండి ఉంటుంది. రైతా చల్లగా ఉండటం వల్ల నోటికి, గొంతుకు హాయిగా అనిపిస్తుంది. దీంతో.. శరీరానికి చల్లదనం లభించడమే కాకుండా.. బిర్యానీ తినడం వల్ల కలిగిన అసౌకర్యాన్ని ఈ రైతా తగ్గిస్తుంది.
రుచిని బ్యాలెన్స్ చేస్తుంది..
ఫుడ్ సైన్స్ లో దీనిని ఫ్లేవర్ బ్యాలెన్స్ ఉంటారు. బిర్యానీ వేడి, కారం, మసాలాలతో ఉంటే.. రైతా చల్లగా, కొంచెం పుల్లగా, ఫ్రెష్ గా ఉంటుంది. ఈ రెండూ కలిపి తిన్నప్పుడు రుచి బ్యాలెన్స్ అవుతుంది.
ఇక.. చాలా వరకు రైతాలో ఉల్లిపాయ, కీరదోస కూడా వేస్తూ ఉంటారు. ఎందుకంటే, కీరదోసలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది. ఇక ఉల్లిపాయ కరకరలాడుతూ టెక్స్చర్ రుచిని పెంచుతుంది. టమాట లోని పులుపు రుచిని బ్యాలెన్స్ చేస్తుంది.
నిజంగా జీర్ణక్రియ వేగంగా అవుతుందా?
దీనిపై ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. అయితే పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ రైతా తిన్నంత మాత్రాన బిర్యానీ తొందరగా జీర్ణమౌతుంది అని మాత్రం చెప్పలేం.
బిర్యానీతో రైతా ఇవ్వడం కేవలం హోటళ్ల సంప్రదాయం మాత్రమే కాదు. మసాలా రుచిని సమతుల్యం చేయడం, నోటికి చల్లదనం ఇవ్వడం, భోజన అనుభవాన్ని మెరుగుపరచడం వంటి కారణాల వల్ల ఈ కాంబినేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.

