MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మడమలు పగిలాయా? ఓ సారి ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి.. పగుళ్లే ఉండవ్..

మడమలు పగిలాయా? ఓ సారి ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి.. పగుళ్లే ఉండవ్..

మడమలు చాలా మందికి పగులుతుంటాయి. దీనివల్ల మడమలు నొప్పి పెడుతుంటాయి. కొంతమందికైతే పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మడమల పగుళ్లను నయం చేయొచ్చు. అదెలాగంటే?

2 Min read
Shivaleela Rajamoni
Published : Mar 15 2024, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పాదాల పగుళ్లు చాలా మందికి ఒక సాధారణ సమస్య. పాదాలు అందంగా, పగళకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. మనలో చాలా మంది పాదాలను, మడమలను అస్సలు పట్టించుకోరు. స్నానం చేసినా.. వాటిని మాత్రం పెద్దగా క్లీన్ చేయరు. దీనివల్లే పగుళ్లు వస్తాయి. దుమ్ము, దూళి, చనిపోయిన కణాలు పేరుకుపోవడం వల్ల పాదాలు పగుళుతుంటాయి. పగుళ్లు ఎక్కువైతే రక్తం కూడా వాటిలోంచి కారుతుంది.దీనివల్ల నడవటానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే పగుళ్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25

నిమ్మరసం

నిమ్మరసంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనితో కూడా పాదాలు పగలకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం రెండు లేదా మూడు చుక్కల నిమ్మరసంలో ఒక టీస్పూన్ వాసెలిన్ మిక్స్ చేసి పాదాలకు అప్లై చేయండి. తర్వాత కాసేపు మసాజ్ చేయండి. 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత పాదాలను కడగండి. దీన్ని వారానికి మూడు లేదా నాలుగు సార్లు అప్లై చేయొచ్చు. దీనివల్ల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి.
 

35

కొబ్బరి నూనె

కొబ్బరినూనెను మనలో చాలా మంది ఒక్క జుట్టుకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కాన్ని దీన్ని చర్మానికి కూడా ఉపయోగించొచ్చు. అవును కొబ్బరి నూనె కూడా మడమల పగుళ్లను తగ్గిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ కొబ్బరినూనెతో పాదాలను మసాజ్ చేయండి. రాత్రిపూట కొబ్బరినూనెను పగుళ్లకు పెట్టి కాసేపు మసాజ్ చేయండి. ఉదయాన్నే పాదాలను కడగండి. కొన్ని రోజులు కంటిన్యూగా ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి. 

45

ఉప్పు

పాదాల పగుళ్లు రాకుండా ఉండటానికి ఉప్పు కూడా బాగా సహాయపడుతుంది. పగుళ్లను కూడా తగ్గిస్తుది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేయండి. అందులో మీ పాదాలను మొత్తం ముంచండి. 20 నిమిషాల తర్వాత బయటకు తీసి పాదాలను శుభ్రంగా కడగండి. 
 

55

పసుపు

పసుపులో శక్తివంతమైన కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మీ పాదాలను మరింత సున్నితంగా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం పసుపును, తులసి, కర్పూరాలను సమాన పరిమాణంలో తీసుకుని అందులో అలోవెరా జెల్ ను కలిపి మడమలపై అప్లై చేయండి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. 

 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved