10ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. ఒకే గదిలో బంధీలుగా..
బయట ప్రపంచంతో సంబంధం లేకుండా.. ఒకే గదికి పరిమితమయ్యారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ముగ్గురు తోబుట్టువులు గత పదేళ్లుగా ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే గదిలో ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.
మిమ్మల్ని ఒక పది నిమిషాల పాటు గదిలో బంధిస్తే.. మీరు ఏం చేస్తారు..? గట్టిగా కేకలు పెట్టి మరీ గడియ తీయమని గోల చేస్తారు కదా..? కానీ.. ముగ్గురు తోబుట్టువులు మాత్రం గంటలు కాదు రోజులు కాదు.. ఏకంగా పది సంవత్సరాల పాటు ఒకే గదిలో బంధీలుగా మిగిలిపోయారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01etmgxma1j3egdb3qj01ac4r2/zzzz-jpg_300x169xt.jpg)
బయట ప్రపంచంతో సంబంధం లేకుండా.. ఒకే గదికి పరిమితమయ్యారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ముగ్గురు తోబుట్టువులు గత పదేళ్లుగా ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే గదిలో ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. తమ తల్లి చనిపోయినప్పటి నుంచి వారు ఆ గది నుంచి బయటికి రాలేదు.
తండ్రి నవీన్ భాయ్ మెహతా వారికి ఆహారం అందిస్తుంటారు. వారి పేర్లు అమ్రీష్ మెహతా (42), మేఘనా మెహతా (39), భవేశ్ మెహతా (30). కాగా, ఆ ముగ్గురిలో పెద్దవాడైన అమ్రీష్ బీఎ ఎల్ఎల్ బీ చదివి లాయర్ గానూ పనిచేశాడు.
మేఘన ఎంఏ సైకాలజీ విద్యాధికురాలు కాగా, చిన్నవాడైన భవేశ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాదు, మంచి భవిష్యత్తు ఉన్న క్రికెటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారట. పదేళ్ల క్రితం వారి తల్లి చనిపోయిన తర్వాత గదిలోకి వెళ్లి పదేళ్లుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు.
ఈ ముగ్గురు తోబుట్టువుల సంగతి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వెల్లడి చేసింది. ఆ గది తలుపులు తెరిచి చూడగా చిక్కి శల్యమైన స్థితిలో ఆ ముగ్గురు తోబుట్టువులు కనిపించారు.
గదిలో మలమూత్రాదుల వాసనలు ఎన్జీవో వారికి దిమ్మతిరిగేలా చేసింది. వారు ఉన్న దారుణమైన పరిస్థితి చూసి కళ్లు చెమ్మగిల్లాయట.
ఇంటికి ఎన్జీవో సభ్యులు వచ్చారని తెలుసుకున్న వారి తండ్రి నవీన్ భాయ్ మెహతా వెంటనే అక్కడికి చేరుకుని, తల్లి పోయిన తర్వాత తన బిడ్డలు ఇలా తయారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ అక్కడ వారు మాత్రం ఇది ముమ్మాటికి మూఢ నమ్మకాల వల్ల తన పిల్లలను చేతబడి నుంచి రక్షించుకోవడానికి ఇలా గదిలో దాచాడని అంటున్నారు. ప్రస్తుతం వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, ఆపై ఓ సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఎన్జీవో సిబ్బంది భావిస్తున్నారు.